అన్వేషించండి

వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్

హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుంటే నా దుస్తులు కూడా తొలగించే వాళ్ళని, వాళ్లకు టాలెంట్ తో పనిలేదు.. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు' అంటూ బాలీవుడ్ పై విరుచుకు పడింది. ఈ మధ్యకాలంలో పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై, ఫిలిం మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది.

ముఖ్యంగా బాలీవుడ్ లో కమిట్మెంట్ పేరుతో లైంగిక దోపిడీలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఏకంగా ఇండస్ట్రీకే దూరమైంది. ఆ వివాదం తర్వాత మళ్లీ పాయల్ బాలీవుడ్లో కనిపించింది లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత తాజాగా మరోసారి బాలీవుడ్ పై తనదైన శైలిలో విరుచుకు పడింది. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ ఇండస్ట్రీపై పాయల్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి." దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిశ్రమంలోకి వచ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొలగించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకి టాలెంట్ తో పనిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు" అని తన ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ సినీ ప్రతిష్టని మరింత దిగజార్చేలా పాయల్ ఘోష్ తాజాగా చేసిన ఈ ట్వీట్స్ పై ఇండస్ట్రీ తరఫున ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. నిజానికి బాలీవుడ్లో కమిట్మెంట్ వ్యవహారం ఎలా ఉంటుందో దానిపై ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సంచలన ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా బాలీవుడ్ పై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంటుంది. ఓసారి పాయల్ ఘోష్ విషయంలో కూడా కంగనా తన మద్దతు ప్రకటించింది. గతంలోనూ పాయల్ చేసిన ఆరోపణల విషయంలో చాలామంది ఫిలిం మేకర్స్ మౌనంగానే ఉన్నారు. కొంతమంది ఖండించే ప్రయత్నం చేసినా వాటిని పాయల్ తిప్పి కొట్టింది.

టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'ప్రయాణం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ ఘోష్ ఆ తర్వాత సౌత్ లో అడపా దడపా సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. చివరగా 'మిస్టర్ రాస్కెల్' అనే సినిమాలో నటించింది. ఈమధ్య మాత్రం సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అవుతోంది.

గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ చెప్పిన పాయల్ అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణ నిజమా? అబద్దమా అనేది తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. బాలీవుడ్లో సినిమా ఒప్పుకోవాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలని, తాను అలా ఇచ్చి ఉంటే ఈపాటికి బాలీవుడ్ లో 30 సినిమాలు చేసేదాన్ని అని గతంలో పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే.

Also Read : 'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్ - మరోసారి థియేటర్స్‌లో భట్టు, చారిల సందడి, ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Padi Kaushik Reddy : కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Embed widget