అన్వేషించండి

Bholaa Shankar Screening: ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!

ఆంధ్రాలో మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా, తాజాగా పోలీసులు చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కింది.  మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. భారీ అంచనాల నడుమ(ఆగష్టు11న)  విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.  

ఏపీలో ‘భోళా శంకర్’కు తిప్పలు

ఇక ఏపీలో మెగాస్టార్ మూవీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోగా, కొన్ని చోట్ల ప్రదర్శనకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాపట్లలో ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. ఓ థియేటర్ లో నిర్ణీత ధరకంటే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని తెలియడంతో అధికారులు చర్యలకు దిగారు. సినిమా ప్రదర్శన ఆపడంతో పాటు థియేటర్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీలో  సినిమా టికెట్ల ధరలపై పరిమితి కొనసాగుతోంది. సింగిల్ స్క్రీన్ లతో పాటు  మల్టీప్లెక్స్ ల విషయంలో అధికారులు టికెట్ల ధరలు నిర్ణయించారు. థియేటర్ నిర్వాహకులు అదే ధరలకు టికెట్లను విక్రయించాలి. అయితే, ‘భోళా శంకర్’ సినిమా విషయంలో ముందుగా నిర్ణయించిన ధరల కంటే ఎక్కు ధరలకు  టికెట్లు విక్రయించే థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు.  

టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వని ఏపీ సర్కారు

 ‘భోళా శంకర్’ సినిమాకు సంబంధించి తెలంగాణ సర్కారు టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఏపీ సర్కారు మాత్రం సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంగా టిక్కెట్ల ధర పెంపుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని వెల్లడించింది. రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతలు చెప్పినా, అవసరమైన పత్రాలను ఇవ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఏపీలో ఈ సినిమా షూటింగ్ 20 శాతం కొనసాగినట్లు ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది. పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.  సినీ రంగానికి సంబంధించి ఎలాంటి వివక్ష లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లు చూపించి టిక్కెట్టు ధరలను పెంచుకోవచ్చని సూచించారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Read Also: ‘శాకుంతలం’ కోసం అలా, 'ఖుషి' కోసం ఇలా- సమంత మౌనం వెనుక కారణం ఏంటి?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalyan Ram : స్టైలిష్ లుక్‌లో కల్యాణ్ రామ్ - హ్యాపీ బర్త్ డే నందమూరి హీరో
స్టైలిష్ లుక్‌లో కల్యాణ్ రామ్ - హ్యాపీ బర్త్ డే నందమూరి హీరో
Maa Inti Bangaram Collections : మా ఇంటి బంగారం మరో రికార్డు - ఓవర్సీస్‌లో గోల్డెన్ నెంబర్
మా ఇంటి బంగారం మరో రికార్డు - ఓవర్సీస్‌లో గోల్డెన్ నెంబర్
Chennai Love Story Songs : చెన్నై లవ్ స్టోరీ హోయిలా హోయిలా సాంగ్ - లవ్‌లో హాయి హాయిగా క్యూట్ లిరిక్స్
చెన్నై లవ్ స్టోరీ హోయిలా హోయిలా సాంగ్ - లవ్‌లో హాయి హాయిగా క్యూట్ లిరిక్స్
GDN Trailer Review : మిరాకిల్ మ్యాన్‌గా మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ లైఫ్ స్టోరీ... ట్రైలర్ చూశారా?
మిరాకిల్ మ్యాన్‌గా మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ లైఫ్ స్టోరీ... ట్రైలర్ చూశారా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget