అన్వేషించండి

Bholaa Shankar Screening: ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!

ఆంధ్రాలో మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా, తాజాగా పోలీసులు చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కింది.  మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. భారీ అంచనాల నడుమ(ఆగష్టు11న)  విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.  

ఏపీలో ‘భోళా శంకర్’కు తిప్పలు

ఇక ఏపీలో మెగాస్టార్ మూవీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోగా, కొన్ని చోట్ల ప్రదర్శనకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా బాపట్లలో ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. ఓ థియేటర్ లో నిర్ణీత ధరకంటే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని తెలియడంతో అధికారులు చర్యలకు దిగారు. సినిమా ప్రదర్శన ఆపడంతో పాటు థియేటర్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీలో  సినిమా టికెట్ల ధరలపై పరిమితి కొనసాగుతోంది. సింగిల్ స్క్రీన్ లతో పాటు  మల్టీప్లెక్స్ ల విషయంలో అధికారులు టికెట్ల ధరలు నిర్ణయించారు. థియేటర్ నిర్వాహకులు అదే ధరలకు టికెట్లను విక్రయించాలి. అయితే, ‘భోళా శంకర్’ సినిమా విషయంలో ముందుగా నిర్ణయించిన ధరల కంటే ఎక్కు ధరలకు  టికెట్లు విక్రయించే థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు.  

టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వని ఏపీ సర్కారు

 ‘భోళా శంకర్’ సినిమాకు సంబంధించి తెలంగాణ సర్కారు టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఏపీ సర్కారు మాత్రం సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంగా టిక్కెట్ల ధర పెంపుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని వెల్లడించింది. రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతలు చెప్పినా, అవసరమైన పత్రాలను ఇవ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఏపీలో ఈ సినిమా షూటింగ్ 20 శాతం కొనసాగినట్లు ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది. పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.  సినీ రంగానికి సంబంధించి ఎలాంటి వివక్ష లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లు చూపించి టిక్కెట్టు ధరలను పెంచుకోవచ్చని సూచించారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Read Also: ‘శాకుంతలం’ కోసం అలా, 'ఖుషి' కోసం ఇలా- సమంత మౌనం వెనుక కారణం ఏంటి?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget