News
News
X

Nayanthara: భర్తకు అవమానం - ఆ హీరో సినిమాల్లో ఇక నటించనని నయనతార వెల్లడి!

హీరోయిన్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై అజిత్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పారు. తన భర్తకు జరిగిన అవమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

యనతార. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో ఫుల్ కెరీర్ ఫుల్ బిజీగా గడుపుతోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటిన ఈ మద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్‘ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు తమిళ యంగ్ హీరో అట్లీ దర్శకత్వ వహిస్తున్నాడు. అయితే, తాజాగా నయనతార సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళ స్టార్ హీరో అజిత్ తో కలిసి ఇకపై సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పింది. నయనతార నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉందట. 

విఘ్నేష్ కు షాకిచ్చిన అజిత్

‘పోడాపోడి‘ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నయనతార భర్త విఘ్నేష్ శివన్‌.  ఆ తర్వాత  ‘నానుమ్‌ రౌడీదాన్‌’ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అజిత్ తో కలిసి ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఈనెల(ఫిబ్రవరి) మొదటి వారంలోనే సెట్స్ మీదకు వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ, చివరి క్షణంలో విఘ్నేష్ శివన్ కు అజిత్ షాక్ ఇచ్చారట. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ అజిత్ తో పాటు లైకా సంస్థకు కూడా నచ్చలేదట. దీంతో కథలో కొన్ని మార్పులు చేయాలని అజిత్ సూచించాడట. దానికి విఘ్నేష్ నో చెప్పడంతో సినిమా చేయనని అజిత్ చెప్పాడట.

అజిత్ సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పిన నయనతార!

ఈ నేపథ్యంలో స్వయంగా నయనతార రంగంలోకి దిగిందట. ఈ ప్రాజెక్టును ఎలాగైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిందట. ఆమె అజిత్ తో పాటు, లైకా సంస్థకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసిందట. కానీ, కథలో మార్పులు చేసే వరకు సినిమా చేయనని అజిత్ చెప్పారట. ఈ నేపథ్యంలో నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇకపై అజిత్ తో సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పిందట. తన భర్తను అవమానించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇకపై లైకా సంస్థతోనూ సినిమాలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది.  

  

సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన నయన్, అజిత్

నయనతార, అజిత్ కలిసి తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించారు. ‘బిల్లా’, ‘ఆరంభం’, ‘విశ్వాసం’ లాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇద్దరు చక్కటి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కానీ, నయనతార తాజా నిర్ణయంతో ఇకపై ఇద్దరు కలిసి సినిమాలు చేసే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు తెగ బాధపడుతున్నారట. అయితే, నయనతార నిర్ణయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోంది. 

Published at : 13 Feb 2023 04:26 PM (IST) Tags: Actor Ajith Actress Nayanthara Nayanthara Decision

సంబంధిత కథనాలు

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన