News
News
వీడియోలు ఆటలు
X

YS Vivekananda Reddy Murder: చాలా అవమానంగా ఉంది... వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించండి... సీబీఐని కోరిన సీఎం మేనమామ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిని సీబీఐ విచారించింది. కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐని కోరానని రవీంద్రనాథరెడ్డి అన్నారు.

FOLLOW US: 
Share:

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనమామ సీబీఐ ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు శనివారం సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని విచారించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో శనివారం సాయంత్రం గంటపాటు విచారించినట్లు సమాచారం. పులివెందులకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తిని కూడా అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం స్పందించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి... చాలా అవమానంగా ఉందని, వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరారని తెలిపారు. 

Also Read: Kurnool Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారు టైరు పేలి ప్రమాదం...ముగ్గురు మృతి, మృతుల్లో వైసీపీ నేత

త్వరగా పరిష్కరించాలని కోరాను

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చేపట్టిన విచారణ 90వ రోజుకు చేరింది. తొలిసారిగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు టీడీపీ నేతలపైఈయన ఆరోపణలు చేశారు. విచారణ అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా బంధువు, రాజకీయ నాయకుడిని కావడంతో విచారణకు పిలిచారని పేర్కొన్నారు. వివేకాతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఆయన మీతో ఎలా ఉండేవారని ప్రశ్నించారని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే అందరినీ ప్రశ్నించడం ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందనే భావనతో విచారణకు పిలిపిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కేసు త్వరగా తేల్చడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. 

Also Read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు... థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

చెప్పుల దుకాణం యాజమానిని కూడా

అంతకుముందు పులివెందులకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడ్ని సైతం అధికారులు విచారించారు. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సీబీఐ అధికారులు చెప్పుల దుకాణం యజమాని మున్నా, ఆయన భార్య రజియాను పలు ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. గతవారం పులివెందులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. కొద్ది రోజుల క్రితం సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ... కోర్టు అనుమతితో విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. 

Also Read: Viyanaka Chavithi 2021: బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలు వద్దు.. ఏపీ సర్కార్ ఆంక్షలపై బీజేపీ ఫైర్... ఏకపక్ష నిర్ణయమని విమర్శలు

Also Read: Corona Updates: కరోనా కొత్త రూపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏవై.12 వేరియంట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

 
Published at : 05 Sep 2021 10:23 AM (IST) Tags: cm jagan cbi AP News AP Crime news YS Viveka murder VIVEKA CASE

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ