అన్వేషించండి

Viyanaka Chavithi 2021: బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలు వద్దు.. ఏపీ సర్కార్ ఆంక్షలపై బీజేపీ ఫైర్... ఏకపక్ష నిర్ణయమని విమర్శలు

బహిరంగ వేదికలపై వినాయక చవితి వేడుకలు నిర్వహించవద్దని ఏపీ సర్కార్ విధించిన ఆంక్షలను బీజేపీ ఖండిస్తుంది. వేడుకలకు అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించవద్దన్న ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది. అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితికి విగ్రహాలను ఏర్పాట్లు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కార్ ఆంక్షలపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

హిందూ వ్యతిరేక విధానాలు!

వినాయకచవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించవద్దన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక కుట్రకోణం దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించలేదా అని ప్రశ్నించారు. ఒకపక్క కరోనా అదుపులో ఉందని చెబుతూనే చవితి వేడుకలకు వైరస్‌ అడ్డంకిగా ఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతుందని ఆయన సీఎం జగన్ కు శనివారం లేఖ రాశారు. హిందూ వ్యతిరేక విధానాల కొనసాగింపులో భాగంగానే చవితి వేడుకలు రద్దు చేసినట్లు హిందూ సమాజం భావిస్తోందన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహిస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బహిరంగ వేడుకలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. 

 

Also Read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు... థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

ఏకపక్ష నిర్ణయం

కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు పనిచేస్తున్నాయని లేఖలో సోము వీర్రాజు గుర్తుచేశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులతో పాటు రాజకీయపక్షాల సలహాలు తీసుకోవాలని సూచించారు. వేడుకలపై ఆంక్షలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. ఊరేగింపులు, నిమజ్జనం చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని నిలిపేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

కర్నూలులో ఆంక్షలపై వివాదం

తాజాగా కర్నూలులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ వివాదం నెలకొంది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని, ఉత్సవాలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిలు ఆదేశాలు జారీచేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. అధికారుల ఆదేశాలను వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే అత్యంత ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు కరోనా పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపులకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. వినాయక ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్,  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు శివ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొనున్నారు. 

 

Also Read: Corona Updates: కరోనా కొత్త రూపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏవై.12 వేరియంట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

 

 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget