అన్వేషించండి

Ganesh Chaturthi 2021: వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు... థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు 90 రోజుల్లో నియామకాలు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్య్ఫూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా నిర్వహించవద్దని పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న కేంద్ర సంస్థల సమాచారంతో చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్‌కు ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్లు అధికారులు తెలిపారు. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 3 శాతం కన్నా తక్కువగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. 

థర్డ్ వేవ్ కు సంసిద్ధం

సుమారు 10 వేల గ్రామ సచివాలయాల పరిధిలో కరోనా కేసులు లేవని అధికారులు ప్రకటించారు. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అన్ని రకాలుగా సిద్ధమయ్యామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్‌ సన్‌ట్రేటర్లు సిద్ధం చేశామన్నారు. మరో 2493 కూడా సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 27,311 ఆక్సీజన్‌ డిటైప్‌ సిలెండర్లు సిద్ధం చేశామన్నారు.  సెప్టెంబరు చివరి నాటికి 95  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇప్పటికి 50 ఆస్పత్రుల్లో పూర్తిచేసినట్లు వివరించారు. 

Also Read: Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

బూస్టర్ డోస్ పై ఆరా

నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యాక్సిన్‌ అనంతరం కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలని వస్తున్న సమాచారంతో అనుసరించాల్సిన వ్యూహంపై ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో మొత్తం 15,001 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటిల్లో 9,988 సచివాలయాల పరిధిలో ఒక్క కోవిడ్‌ యాక్టివ్ కేసు లేదని అధికారులు వెల్లడించారు. 2,610 సచివాలయాల్లో ఒకే ఒక్క యాక్టివ్‌ కేసు మాత్రమే ఉందని తెలిపారు. 248 మండలాల్లో నాలుగు కేసులు కన్నా తక్కువగా ఉన్నాయని తెలిపారు. 145 మండలాల్లో 9 లోపు యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 676 మండలాల్లో కేవలం 4 మండలాల్లో 100 ఆపైన కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget