అన్వేషించండి

Ganesh Chaturthi 2021: వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు... థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు 90 రోజుల్లో నియామకాలు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్య్ఫూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా నిర్వహించవద్దని పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న కేంద్ర సంస్థల సమాచారంతో చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్‌కు ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్లు అధికారులు తెలిపారు. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 3 శాతం కన్నా తక్కువగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. 

థర్డ్ వేవ్ కు సంసిద్ధం

సుమారు 10 వేల గ్రామ సచివాలయాల పరిధిలో కరోనా కేసులు లేవని అధికారులు ప్రకటించారు. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అన్ని రకాలుగా సిద్ధమయ్యామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్‌ సన్‌ట్రేటర్లు సిద్ధం చేశామన్నారు. మరో 2493 కూడా సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 27,311 ఆక్సీజన్‌ డిటైప్‌ సిలెండర్లు సిద్ధం చేశామన్నారు.  సెప్టెంబరు చివరి నాటికి 95  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇప్పటికి 50 ఆస్పత్రుల్లో పూర్తిచేసినట్లు వివరించారు. 

Also Read: Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

బూస్టర్ డోస్ పై ఆరా

నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యాక్సిన్‌ అనంతరం కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలని వస్తున్న సమాచారంతో అనుసరించాల్సిన వ్యూహంపై ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో మొత్తం 15,001 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటిల్లో 9,988 సచివాలయాల పరిధిలో ఒక్క కోవిడ్‌ యాక్టివ్ కేసు లేదని అధికారులు వెల్లడించారు. 2,610 సచివాలయాల్లో ఒకే ఒక్క యాక్టివ్‌ కేసు మాత్రమే ఉందని తెలిపారు. 248 మండలాల్లో నాలుగు కేసులు కన్నా తక్కువగా ఉన్నాయని తెలిపారు. 145 మండలాల్లో 9 లోపు యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 676 మండలాల్లో కేవలం 4 మండలాల్లో 100 ఆపైన కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget