అన్వేషించండి

Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

వైఎస్ కుమార్తె షర్మిల తాను ఒంటరి దాన్నయ్యాయని సంచలన ట్వీట్ చేశారు. తండ్రి తనకు ఎంత ఆప్యాయత పంచారో గుర్తు చేసుకున్నారు. ఆన్న ఆదరించడం లేదనే ఆమె ఈ ట్వీట్ చేశారా..?


వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తాను ఒంటరి దాన్నయ్యాయని సంచలన ట్వీట్ చేశారు. తండ్రి తనకు ఎంత ఆప్యాయత పంచారో గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన కంట కన్నీరు ఆగడం లేదని ఉద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

వైఎస్ షర్మిల పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఎందుకు ఒంటరిగా ఫీలవుతున్నారు ? వైఎస్ కుటుంబం అంతా ఆమె వెనుక లేదా ? తండ్రిలా చూసుకోవాల్సిన అన్న కూడా పట్టించుకోవడం లేదా ? అంత పెద్ద నేత కుమార్తెకు ఎందుకీ కష్టం వచ్చింది ? ఇప్పుడు ఇవే రాజకీయ పార్టీల నేతలందరికీ వస్తున్న సందేహాలు. 

ఇడుపులపాయలో పలకరించుకోని జగన్, షర్మిల..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబం అంతా నివాళులు అర్పించడానికి ఇడుపుల పాయకు వెళ్లారు. గతంలో జయంతి రోజు ఉదయం షర్మిల, సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న  ప్రచారం జరిగింది. ఈ సారి అలాంటి ప్రచారానికి చెక్ పెట్టడానికి కుటుంబం అంతా కలిసి వెళ్లి నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఒక రోజు ముందుగానే షర్మిల, వైఎస్ విజయలక్ష్మితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులకు చేరుకున్నారు. అందరూ ఒకే భవనంలో బస చేశారు కూడా. అలాగే అందరూ కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. వైఎస్ విజయలక్ష్మితో పాటు జగన్, షర్మిల పక్క పక్కనే కూర్చుని తండ్రిని స్మరించుకున్నారు. దీంతో రాజకీయాలు ఎలా ఉన్నా కుటుంబం అంతా ఒకటేనని అనుకున్నారు.
Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

ఒంటరి అయ్యానని షర్మిల అనుకోవడానికి అదేనా కారణం..! 

కానీ నివాళులు అర్పించడం ముగిసిన వెంటనే వైఎస్ షర్మిల తాను ఒంటరినని భావోద్వేగ ట్వీట్ పెట్టడంతో కలకలం ప్రారంభమయింది. అసలేం జరిగిందనే చర్చ కూడా ప్రారంభయింది. జగన్, షర్మిల ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని తండ్రిని స్మరించుకున్నారు కానీ వారు మాట్లాడుకోవడం ఎవరూ చడలేదు. ఒకరి ముఖాలు కూడా ఒకరు చూసుకోలేదు. మాట్లాడుకోలేదు. ముభావంగానే ఉన్ారు.  కేవలం కలిసి నివాళులు అర్పించడానికి వచ్చారు కానీ వారి మధ్య నిజంగానే మాటల్లేవన్న అభిప్రాయం ఈ ఘటన ద్వారా బలపడిందని అంటున్నారు.
Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

వైఎస్ఆర్ ఎస్టేట్‌లో రాత్రి కుటుంబ సమావేశం జరిగిందా..? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించేందుకు  షర్మిల, విజయలక్ష్మితో పాటు వైఎస్ జగన్ కూడా ఒకటో తేదీన పులివెందులకు వచ్చారు. వారంతా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్‌లోనే బస చేశారు. ఒకే భవనంలో కుటుంబం అంతా ఉన్నారు. వైఎస్ భారతి మాత్రం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప నుంచి పులివెందుల వచ్చిన తర్వాత ఇడుపుల పాయ ఎస్టేట్‌కు వెళ్లలేదు. మిగిలిన అందరూ వైఎస్ఆర్ ఎస్టేట్‌లోనే బస చేశారు. ఈ సందర్భంగా కుటుంబం విషయాలు, రాజకీయ అంశాలపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు రాజకీయంగా సహకరించేందుకు సీఎం జగన్ అయిష్టత చూపి ఉంటారని అందుకే ఆమె ఒంటరి అనే భావనకు వచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

షర్మిల పార్టీకి విజయమ్మ మద్దతు - జగన్ వ్యతిరేకత 

షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకు ముందే బహిరంగంగా ప్రకటించారు.  అయితే ఆమెకు తల్లి విజయలక్ష్మి మద్దతిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలిద్దరూ రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని ప్రకటించారు. అదే విధంగా షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీ కోసం కష్టపడుతున్నారు.  వర్థంతి రోజు హైదరాబాద్‌లో వైఎస్ ఆత్మీయులందర్నీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలెవరూ వెళ్లవద్దని హైకమాండ్ ఆదేశిచింది. హాజరయ్యేందుకు జగన్ కూడా ఆసక్తి చూపించలేదు.  తండ్రి పేరుపై నిర్వహిస్తున్న సంస్మరణకు హాజరయ్యేందుకు సీఎం జగన్ నిరాకరించడంతో  షర్మిల తాను ఒంటరి అయ్యానని మరింత బలంగా అనుకుంటున్నారని భావిస్తున్నారు.
Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

రాజకీయంగా వెళ్తున్నారని సోదరిని వ్యక్తిగతంగా జగన్ దూరం పెడుతున్నారా..? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం ఆయన కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండేవి కావు. చాలా పెద్ద కుటుంబం అయినప్పటికీ వైఎస్ మాట అంటే అందరికీ వేదవాక్కులా ఉండేది. అయితే ఆయన మరణం తర్వాత కుటుంబం మొత్తాన్ని ఏకతాటిపైకి ఉంచడంతో  జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారన్న అభిప్రాయం పులివెందులతో పాటు వారి కుటుంబంలోనూ వినిపిస్తోంది. కొంత మందిని ప్రోత్సహించడం.. మరికొంద మందిని దూరం పెట్టడం వంటి చర్యల ద్వారా సొంత వారిని జగన్ దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయ పరంగా విభేదాలు రాని కుటుంబాలు ఉండవని చెప్పుకోవచ్చు. కానీ అంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు ఎవరూ తెంచుకోరు. కానీ దీనికి భిన్నంగా షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా చెల్లిని దూరం పెడుతున్నారన్న అభిప్రాయం ప్రస్తుత పరిణామాల వల్ల ఏర్పడుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi News: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
Bajaj Avenger Street 220 Launched: బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 కొత్త వెర్షన్ లాంచ్ - రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్.. క్రూయిజర్ బైక్ లో అదిరిపోయే మార్పులు
బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 కొత్త వెర్షన్ లాంచ్ - రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్.. క్రూయిజర్ బైక్ లో అదిరిపోయే మార్పులు
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget