అన్వేషించండి

BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే

BMC Election Result: ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత ఎన్నికల మాదిరిగానే అన్ని వార్డుల ఓట్లూ ఒకేసారి లెక్కించకపోవడంతో జాప్యం జరుగుతుంది.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (జనవరి 16న) 10 గంటలకు ప్రారంభమైంది. అయితే ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. జనవరి 15న ముంబైలో 2017 తరహాలోనే 227 ఎన్నికల వార్డులలో ఒకేసారి ఓట్ల లెక్కింపు కాకుండా, దశల వారీగా లెక్కింపు జరగడం వల్ల శుక్రవారం ఉదయం లెక్కింపు ప్రారంభమైనప్పటికీ ఫలితాల ప్రకటన ఆలస్యం కావచ్చని సివిక్ అధికారులు తెలిపారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మహానగరంలోని 23 కేంద్రాలలో ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రారంభించింది. గత ఎన్నికల మాదిరిగా కాకుండా, అన్ని వార్డుల లెక్కింపు ఒకేసారి ప్రారంభం కాలేదు. ఒకసారి రెండు వార్డుల ఓట్లను లెక్కిస్తారు. అంటే, ఉదయం 10 గంటలకు 227 వార్డులకు బదులుగా కేవలం 46 వార్డుల లెక్కింపు మాత్రమే చేపట్టారు.

ఒకేసారి రెండు వార్డుల ఓట్ల లెక్కింపు

అధికారుల ప్రకారం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్పుల కారణంగా, గత ఎన్నికలకు భిన్నంగా, ప్రక్రియ ప్రారంభమైన వెంటనే 227 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉండవు. అన్ని సీట్ల ఫలితాలు చాలా ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. గత వారం సివిక్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో, BMC అధికారులు మాట్లాడుతూ.. "ఒకేసారి రెండు వార్డుల ఓట్లను లెక్కింపు చేయడం వల్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న సిబ్బంది ఆ రెండు వార్డులపై మాత్రమే పనిచేస్తాయి" అన్నారు.

ఫైనల్ ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యం - గగ్రాణి

మున్సిపల్ కమీషనర్ భూషణ్ గగ్రాణి ఫలితాల ప్రకటనపై మీడియాతో మాట్లాడారు. అన్ని సీట్ల తుది ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం కావచ్చని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు ఒక గంట ఆలస్యం కావచ్చని తెలిపారు. సాధారణం కంటే ఒక గంట ఎక్కువ సమయం పట్టవచ్చు అన్నారు. మున్సిపల్ కమీషనర్ గగ్రాణి జనవరి 15న బీఎంసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. తగిన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల చర్యలు తీసుకున్నామని చెప్పారు.

2,299 మంది అధికారులు, సిబ్బంది నియామకం

ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 2,299 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 759 మంది సూపర్‌వైజర్లు, 770 మంది అసిస్టెంట్లు ఉండగా, 770 మంది క్లాస్ IV ఉద్యోగులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సిబ్బందికి ముందే శిక్షణ ఇచ్చారు. ఖచ్చితత్వంతో పాటు పారదర్శకతను నిర్ధారించడానికి ఫలితాలను కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌ను ఉపయోగించి లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని BMC తెలిపింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 227 సీట్ల కోసం 1,700 మంది అభ్యర్థులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నేటి సాయంత్రానికి పూర్తి ఫలితాలు రానున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
Advertisement

వీడియోలు

India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam
Gautam Gambhir about Surya T20 Captaincy | టీ20 కెప్టెన్సీపై హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
Bad Hair Cut Case: రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
HYDRA News: కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా
కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా
Best Mileage Car of India: భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు Maruti Celerio- ధర, ఫీచర్లు చూసి కొనేయండి
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు Maruti Celerio - ధర, ఫీచర్లు చూసి కొనేయండి
IND vs PAK T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Embed widget