Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Sammakka Saralamma: మేడారం జాతరకు సమయం దగ్గరపడుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఏడాది చాలా మార్పులు జరుగుతున్నాయ్. వాటిలో ఒకటి నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు...

Medaram Sammakka Saralamma Trust Board: వీరవనితలుగా, ధీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా సమ్మక్క, సారలమ్మను కొలుస్తారు. ఈసారి జాతరలో చాలా వినూత్న నిర్ణయాలు అమలుచేస్తున్నారు పాలకులు. అందులో భాగంగా ఈ ఏడాది జాతర పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే జరగనుంది. ఈ మేరకు మహిళలతో ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో స్తీశక్తితో..జాతర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, పదకొండుమంది డైరక్టర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలపి మొత్తం 14 మందితో మేడారం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మేడారం జాతర ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే కట్టబట్టే సమయంలో ప్రమామస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ధీరత్వానికి ప్రతీకలుగా చెప్పే సమ్మక్క సారలమ్మ దేవతల స్ఫూర్తితో ఈ సారి పూర్తిగా మహిళల చేతుల మీదుగా బాధ్యతలు నిర్వహించడం ఓ వరంగా భావిస్తున్నామన్నారు సీతక్క. జాతర నిర్వహణలో స్త్రీశక్తిని చాటుతామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా మహిళలకే పాలనా పగ్గాలు అప్పగించి..ఇంత పెద్ద జాతరను వారి భుజస్కందాలపై పెట్టాం. స్త్రీ శక్తిని నిరూపించుకునేందుకు ఇదో గొప్పఅవకాశం అని...నూతన కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.భక్తి శ్రద్ధలతో విజయవంతంగా అమ్మవార్ల జాతర నిర్వహిస్తాం అన్నారు.
మొత్తం 14 మంది కమిటీ సభ్యుల్లో 13 మంది మహిళలున్నారు. చైర్ పర్సన్ గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. వైస్ చైర్ పర్సన్, డైరెక్టర్లు, ఇతర సభ్యులు కూడా మహిళలే...ఒక్క ఎక్స్ అఫీషియో మెంబర్ తప్ప. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో ఏర్పడిన ఈ కమిటీకి అతివల డైరెక్షన్లో అమ్మల జాతర అనే పేరు పెట్టారు. ఓరుగల్లు పేరు వినగానే పౌరుషానికి ప్రతీక అయిన రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది. సమ్మక్క, సారలమ్మ ధైర్యాన్ని గుర్తుచేస్తూ ఈ సారి జాతర మొత్తం మహిళల సారధ్యంలో జరగబోతోంది. ఇది గిరిజన సమాజంలో మహిళా నాయకత్వానికి గొప్ప గుర్తింపు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు..ఒకరు మంత్రి సీతక్క కాగా, మరొకరు కొండా సురేఖ. ఇద్దరు మాత్రమే కాదు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలిగా డాక్టర్ కడియం కావ్య, వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ఉన్నారు. ఇంకా...వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ వాజ్ పాయ్, వరంగల్ సెట్రల్ జోన్ పోలీస్ కమిషనర్ గా సరిత ఉన్నారు.


గిరిజనులకు మాత్రమే సొంతమైన మేడారం ఇప్పుడు అందరి జాతరగా ఎలా మారింది? సమ్మక్క-సారలమ్మల కథేంటి?
వనదేవతల జాతరకు లక్షల్లో భక్తజనం, జాతరకు వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం బుక్ చేసుకోండి ఇలా!
బకెట్ వేడినీళ్లు రూ.50, మేడారం జాతరలో సరికొత్త వ్యాపారం!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















