PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శనతో మెడల్స్ సాధించిన భారతీయ అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కృషిని, దేశానికి వారు తెచ్చిన గౌరవాన్ని ప్రధాని మనస్పూర్తిగా అభినందించారు.
అథ్లెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశంలో క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత క్రీడారంగంలోకి వచ్చేలా మంచి సపోర్ట్, వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని ఆత్మీయతపై గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ సాక్షి చౌదరి స్పందిస్తూ, "ప్రధాని నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడటం ఎంతో గర్వంగా ఉందంటూ" తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ సోషల్ మీడియా వేదికగా "ఆడేవాళ్లే మెరుస్తారు, ఎప్పుడూ భారత్కు మద్దతుగా నిలవండి, భారత్ మాతాకీ జై" అని సందేశాన్ని ఇచ్చారు.
కీలకమైన కొన్ని క్రీడలు లేకపోయినా ఇండియా 4వ స్థానంలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇతర క్రీడల అథ్లెట్లు ముందుకు వచ్చి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి హెల్ప్ అయింది. రాబోయే రోజుల్లో ఇండియా తన స్పోర్ట్స్ బేస్ను విస్తరించడానికి, అన్ని రకాల క్రీడల్లో డెప్త్ పెంచుకోవడానికి గ్లాస్గో పర్ఫార్మన్స్ చాలా ఉపయోగపడుతుందని పీఎంఓ ప్రతినిధి వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు





















