అన్వేషించండి

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో మార్కులు బాగా రావనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Visakha News : విశాఖలో విషాద ఘటన జరిగింది. నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖలో  వరసగా ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇందులో అధిక సంఖ్య విద్యార్థులే ఉండడం గమనార్హం. కడుపులో నొప్పి ఉండడం వల్ల రెండు రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగానని పరీక్షలలో తనకు బాగా మార్కులు రావనే మనస్థాపంతో  విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయపాలెం దగ్గర గల నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుచున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థినిని వెంటనే కొమ్మాదిలో గల గాయత్రి హాస్పిటల్ కి తరలించగా కానీ అప్పటికే విద్యా్ర్థిని మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. బాలిక ఆత్మహత్య వెనుక చదువుల ఒత్తిడే కారణమా? ఇంకేదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

"అమ్మా, డాడీ సారీ, అసలు నేను ఇలా చేస్తానని ఏ రోజు అనుకోలేదు. నేను ఇలా చేసుకునేందుకు కారణం ఎవరికి తెలియదు. నేను ఈ పరీక్ష బాగా రాయలేదు. IIA వరకు బాగానే రాశాను కానీ తర్వాత కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తిరిగి అసలు ఏం చదవలేకపోయాను. IIB, ఫిజిక్స్ అసలు బాగా రాయలేదు. ఫిజిక్స్ అయితే అసలు బాగా రాయలేదు. పాస్ అవుతాను కానీ వచ్చే మార్కులు నా పర్సంటేజ్ ను తగ్గించేస్తుంది. కానీ అందరూ మిమ్మల్ని అదోలా చూస్తారు. నాకు వచ్చే మార్కుల వల్ల నాన్న మీరు నలుగురిలో తల ఎత్తుకోలేరు. నా వల్ల మీరు తలదించుకోకూడదు. నేను సూసైడ్ చేసుకోవాలని ఎగ్జామ్ హాల్ లోనే అనుకున్నాను. చివరి నిమిషంలోనైనా సంతోషంగా ఉందామని అందరితో సంతోషంగా ఉన్నాను. నేను ఇలా చేసినందుకు మీరు ఏడుస్తారు సారీ, కానీ నాకు చాలా తక్కువ మార్కులు వస్తాయి, అందుకు నేను డిప్రషన్ లోకి వెళ్లిపోయాను.అందుకే ఇలా చేస్తున్నాను." - విద్యార్థిని 

నార్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మార్చి 24న మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని,  మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి తేజ ఆత్మహత్య కు గల‌ కారణాలను తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. అయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుతున్న క్రమంలో సాయి తేజ ఇలా బలవన్మరణాకి పాల్పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువుల ఒత్తిడి కారణంగానే తమ అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Embed widget