అన్వేషించండి
Sirimanotsavam: శ్రీకాకుళంలో గ్రామ దేవత వేడుకల్లో విషాదం, సిరిమాను కిందపడి ఇద్దరు మృతి
Kuppili Sirimanotsavam Tragedy | శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామదేవత ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సిరిమాను విరిగి కిందపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Sirimanotsavam celebrations in Etcherla | ఎచ్చెర్ల: గ్రామ దేవత ఊరేగింపు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకకు పెద్ద ఎత్తున స్థానికులు హాజరు కావడంతో సందడి నెలకొంది. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కింద పడింది. సిరిమాను పటడంతో బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి(50), అప్పన్న (40) అక్కడికక్కడే మృతిచెందారు. వేడుకల్లో విషాదం జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
పాలిటిక్స్
లైఫ్స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion