అన్వేషించండి

CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్‌ కేసు ! తర్వాత ఏంటి ?

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ..కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు కేసు పెట్టారు. దర్యాప్తులో ఉన్న సీబీఐ అధికారిపై కేసు పెట్టడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case )  దూకుడుగా విచారణ జరుపుతున్న సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని కొంత మందికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్ రెడ్డి ( Uday Kumar Reddy )  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.  కేంద్ర దర్యాప్త సంస్థకు చెందిన అధికారి అదీ కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సీబీఐ అధికారి రాంసింగ్‌పై ( CBI SP Ram singh ) ఇప్పటికి అటు అనంతపురం ఇటు కడప ఎస్పీలకు ఇద్దరు ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే ఆ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ మూడో ఫిర్యాదుగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ విషయంలో మాత్రం కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. 

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందులలో ఉన్న యూరేనియం ఫ్యాక్టరీ ఉద్యోగి. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితునిగా పేరు ఉంది. గతంలో ఓ సారి ఆయనను సీబీఐ పిలిచి విచారణ జరిపింది. అప్పట్లో ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇటీవల మరోసారి పిలిచి ప్రశ్నించింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీబీఐ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు అనుమానితులపై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 

సీబీఐ అధికారి రాంసింగ్ పై గత నవంబర్ 29న  వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.  వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డిని అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న సీఐ శ్రీరామ్ ... దేవిరెడ్డి శంకర్ రెడ్డి హత్య చేయించినట్లు ఒప్పుకోమని తీవ్ర ఒత్తిడి తెచ్చారని డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఆశ చూపారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీన వివేకా పీఏ కృష్ణారెడ్డి  కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నారు.  వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. 

ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కేసు నమోదయింది. తదుపరి ఏం  చర్యలు తీసుకుంటారన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ సీబీఐ ఎస్పీని లోకల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
IND VS SL Day 3 Updates: వెలుతురు లేదంటూ లంక ప్లేయర్ల ఫిర్యాదు.. మంజ్రేకర్ ఘాటు విమర్శలు, కొలంబో టెస్ట్ లో హైడ్రామా!
వెలుతురు లేదంటూ లంక ప్లేయర్ల ఫిర్యాదు.. మంజ్రేకర్ ఘాటు విమర్శలు, కొలంబో టెస్ట్ లో హైడ్రామా!
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Embed widget