అన్వేషించండి

CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్‌ కేసు ! తర్వాత ఏంటి ?

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ..కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు కేసు పెట్టారు. దర్యాప్తులో ఉన్న సీబీఐ అధికారిపై కేసు పెట్టడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case )  దూకుడుగా విచారణ జరుపుతున్న సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని కొంత మందికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్ రెడ్డి ( Uday Kumar Reddy )  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.  కేంద్ర దర్యాప్త సంస్థకు చెందిన అధికారి అదీ కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సీబీఐ అధికారి రాంసింగ్‌పై ( CBI SP Ram singh ) ఇప్పటికి అటు అనంతపురం ఇటు కడప ఎస్పీలకు ఇద్దరు ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే ఆ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ మూడో ఫిర్యాదుగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ విషయంలో మాత్రం కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. 

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందులలో ఉన్న యూరేనియం ఫ్యాక్టరీ ఉద్యోగి. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితునిగా పేరు ఉంది. గతంలో ఓ సారి ఆయనను సీబీఐ పిలిచి విచారణ జరిపింది. అప్పట్లో ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇటీవల మరోసారి పిలిచి ప్రశ్నించింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీబీఐ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు అనుమానితులపై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 

సీబీఐ అధికారి రాంసింగ్ పై గత నవంబర్ 29న  వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.  వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డిని అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న సీఐ శ్రీరామ్ ... దేవిరెడ్డి శంకర్ రెడ్డి హత్య చేయించినట్లు ఒప్పుకోమని తీవ్ర ఒత్తిడి తెచ్చారని డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఆశ చూపారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీన వివేకా పీఏ కృష్ణారెడ్డి  కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నారు.  వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. 

ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పై కేసు నమోదయింది. తదుపరి ఏం  చర్యలు తీసుకుంటారన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ సీబీఐ ఎస్పీని లోకల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
Hero Destini 110 డైలీ యూజ్‌కు బాగానే ఉంటుందా? నిజ జీవిత మైలేజ్‌ వివరాలు ఇవే
హీరో డెస్టిని 110 మైలేజ్‌ టెస్ట్‌ - నిజంగా సిటీలో ఎంత ఇస్తుంది? హైవే ఎక్కితే ఎంత వస్తుంది?
Stock Market Crash: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్
Flights Cancel: యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Embed widget