అన్వేషించండి

Palnadu News: పల్నాడులో దారుణం, అక్కసుతో గొంతులు కోసిన యువకుడు

పిన్ని కుటుంబానికి సంబంధించిన వారిని పూర్తిగా తుదముట్టిస్తే ఆస్తి సొంతం చేసుకోవచ్చనే దుర్మార్గపు ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం పిన్ని సోదరి, తమ్ముడిని అత్యంత కర్కశంగా హత్యచేశాడు నిందితుడు. పిన్ని కుటుంబానికి సంబంధించిన వారిని పూర్తిగా తుదముట్టిస్తే ఆస్తి సొంతం చేసుకోవచ్చనే దుర్మార్గపు ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళకు చెందిన షేక్ ఖాశీంకు ఇద్దరు కుమారులు వారి పేరు పెద మీరా సాహెబ్, చిన మీరా సాహెబ్. ఖాశీం ఇద్దరు కుమారులకు చెరి రెండెకరాల ఆస్తి ఇచ్చాడు. ఖాశీం మరణించాడు. కొంత కాలానికి ఇద్దరు  అన్నదమ్ములు కుడా కాలం చేశారు. పెదమీరా సాహెబ్ పెద్ద కొడుకు ఖాశీం అతని కుమారుడు జాకీర్. ఇతని వాటాగా వచ్చిన పొలాన్నీ అప్పుల కారణంగా విక్రయించాడు. చినమీరా సాహెబ్ భార్య రహీమూన్ కు ముగ్గురు సంతానం. ఒక కుమార్తె ఇద్దరు కొడుకులు.. చిన మీరా సాహెబ్ మృతి  చెందిన తర్వాత మగ్గురు బిడ్డలతో కలసి ధూళిపాళ్ళ లో నివసిస్తోంది‌. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద కుమారుడు జబ్బార్ కరోనా సెకండ్ వేవ్ లో మృతి చెందాడు. రెండవ కుమారుడు రహిమాన్ సత్తెనపల్లిలో ప్రైవేట్ స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఉన్న రెండు ఎకరాల సాగు చేసుకుంటూ.. చిరు ఉద్యోగం చేస్తూ పరువుగా కుటుబాన్ని లాక్కొస్తున్మాడు.

కుటుంబాన్ని అంతం చేసేందుకు పథకం..

ఆప్పుల పాలై ఆస్తిని పోగొట్టుకున్న ఖాశీం తన చినాన్న ఆస్తిని కాజేయాలని మొదటి నుంచి దుర్భుద్దితో ఉన్నాడు. పిన్నమ్మ వద్దకు వచ్చి ఇద్దరు కుమారులలో‌ పెద్ద కుమారుడు చనిపోయాడు కనుక ఆస్తిని రెండు బాగాలు చేసీ తనకు ఒక బాగాన్ని  ఇవ్వాలని గొడవ పడేవాడు. చాలా సార్లు పిన్ని రహీమూన్ వద్దకు వచ్చి ఆస్తి తనకు కూడా ఇవ్వాలని గొడవ పడే వాడు. అస్తీ తన బిడ్డలకే చెందుతోందని కరాఖండిగా చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు ఖాశీం. పినతల్లి కుటుంబాన్ని అడ్డు తొలగించుకుంటే ఇక తనకు అడ్డు ఉండదని.. పిన్నమ్మ పిల్లలలో‌ ఎవ్వరికీ పెళ్ళి కాలేదు కనుక వారసులు కూడా లేరని అడ్డు తప్పిస్తే వారి ఆస్తి తన సొంతమౌతుందని భావించాడు.
పిన్ని కుటుంబం మొత్తాన్ని హత మార్చేందుకు సిద్దమయ్యాడు. ఖాశీం తన కుమారుడు జాకీర్ తో కలసి ధూళిపాళ్ళ వెళ్ళాడు. పిన్ని రహిమూన్(65) వద్దకు వెళ్లాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అది చూసి  భయంతో బయటకు వెళ్ళేదుకు ప్రయత్నించిన సోదరి మాలాంబి(36) గమనించి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.

ఆదే సమయంలో పెళ్లి కబురు చెప్పేందుకు మరో బందువు ఇంటికి వచ్చాడు. అలికిడి విన్న కాశీం అతని  కుమారుడు వెనుక డోర్  నుంచి పరారు అయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని హాస్పటల్ కు తరలించేందుకు స్థానికులు ప్రయత్నించారు. రహీమూన్ అప్పటికే‌ మృతి చెందింది. మాలింబీనీ సత్తనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స‌ పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. అప్పటి వరకు ఇద్దరు మాత్రమే హత్య అయినట్లు భావించారు.

నిందితుడు కాశీం తన పిన్నమ్మ కుమారుడు రహెమాన్ కూడా హత్య చేస్తే ఆ కుటుంబంలో మరెవ్వరూ ఉండరని అతనిని చంపేందుకు దారి కాచాడు..రెహమాన్ కు ఫేన్ చేసి మాట్లాడు కుందాం రమ్మని పిలిచాడు. నిజమని నమ్మి ఈద్గా దగ్గరకు వెళ్ళాడు. రహమాన్ రాగానే మాట్లాడు తున్నట్లు నటిస్తూ ఒక్క సారిగా తన కుమారుడితో కలిసి‌దాడి చేసి గొంతు పిసికి చంపాడు ఖాశీ. రహమాన్ మృత దేహాన్ని గోతాంలో కుక్కి పొదలలో పడేశాడు.

నిందితుల కోసం గాలింపు..

హత్య జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ లోపు గోనె సంచిలో మృత దేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు  చెప్పారు. మృత దేహం రెహమాన్ ది గుర్తించారు. స్థానికుల నుంచి, బంధువుల నుంచి సమాచారం సేకరించి ఆస్తి కోసం జరిగిన హత్యగా కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం మూడు హత్యలు జరిగినాయని తెలియడంతో ఒక్కసారిగా జిల్లా వారసులలో ఆందోళన నెలకొంది. ఈ రోజు పల్నాడు ఎస్పీ హత్య జరిగిన ధూళిపాళ్ళ గ్రామానికి వచ్చి హత్య జరిగిన తీరు తదితర వివరాలు స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేవిధంగా సాక్షాలను, ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Plug-in Hybrid SUV: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
Embed widget