అన్వేషించండి

అక్రమ సంపాదనతో ఆగమైన కుటుంబం, నాడు భర్త, నేడు భార్య మృతి!

షేక్ పేట మాజీ తహసీల్దార్ సుజాత మరణించారు. బంజారాహిల్స్ లోని ఓ భూవివాదంలో చిక్కుకున్న ఆమె జైల్లో ఉండగానే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆమె గుండెపోటుతో మరణించింది.

అవినీతి కేసులో దొరికిపోయిన షేక్ పేట మాజీ తసహసీల్దార్ సుజాత అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు సర్కారు పాలైంది. అవమానాలు తట్టుకోలేని ఆమె భర్త ప్రాణాలు విడిచాడు. సస్పెన్షన్, కేసులు, భర్తను కోల్పోయిన బాధ, మానసిక వేదన.. ఇలా సవాలక్ష కారణాలతో షేక్ పేట మాజీ ఎమ్మార్వో సుజాత ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఈరోజు గుండెపోటుతో మృతి చెందింది. అయితే పలువురు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మాజీ ఎమ్మార్వో మృతి విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అసలేం జరిగిందంటే..?

రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ లోని ఓ స్థలం వ్యవహారంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్ పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడ్డాడు. ఈ కేసులో తహసీల్దార్ సుజూత హస్తం కూడా ఉందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించగా.. భారీగా నగదు లభ్యం అయింది. నగదు విషయంలో తహసీల్దార్ సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించగా.. ఆమె భర్తను కూడా ప్రశ్నించారు. భూముల విషయంలో తహసీల్దార్ ప్రమేయం ఉన్న్లు ప్రాథమికంగా నిర్ధరణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు పంపించారు. 

అపార్ట్ మెంట్ పైనుంచి దూకి అజయ్ ఆత్మహత్య..!

అయితే ఆమె భర్త అజయ్ ను ఆ మరుసటి రోజు విచారించాల్సి ఉంది. రమ్మని అతడికి కబురు పంపారు. అయితే అవినీతి కేసులో భార్య పట్టుబడడం, అరెస్ట్ అవడం, రోజుల తరబడి విచారించడం, ప్రశ్నలు అఢగడాన్ని జీర్ణించుకోలేక అదే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ విశ్వ విద్యాలయంలో ఆచార్యుడిగా పని చేసే అజయ్.. తన ఇంటి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. భర్త ఆత్మహత్య, కేసులు, సస్పెన్షన్లతో సుజాత అనారోగ్యానికి గురైంది. మానసికంగా, శారీరకంగా చాలా బలహీన పడిపోయింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. తాజాగా ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఉన్నత ఉద్యోగాలతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని.. అవినీతి కేసు వారిని ఆగం చేసింది. 

సయ్యద్ ఖాలెద్ కూడా నిందితుడే..!

కాగా.. ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఇందులో ఫిర్యాదు దారుడు సయ్యద్ అబ్దుల్ ఖాలెద్ కూడా నిందితుడేనని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. అతడిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ తనదిని చెబుతున్న బంజారాహిల్స్ లోని 4,865 చదరపు గజాల స్థలం కూడా అతడిది కాదని తెలుస్తోంది. అతను ఇచ్చిన పత్రాలన్నీ ఫోర్జరీవేనని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget