మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు.
Hyderabad Drugs Seized: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని గుర్తించి, ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రెడ్డి సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

- హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ముగ్గురు పట్టుబడ్డారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
- ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, నిఘా పెంచింది.
Drug Bust in Hyderabad | హైదరాబాద్: భాగ్యనగరంలో పాతబస్తీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న ముగ్గురు కస్టమర్లను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురానాపూల్ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా, పోలీసుల రాకను గమనించి వారిలో నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుబడగా, వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, అలాగే 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జాసింగ్ అనే మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిటేషన్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
హైదరాబాద్లో డ్రగ్స్ నిర్మూలనకు, ఈ సమస్యలపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది.
TG-NAB (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) బలోపేతం.. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. మోడ్రన్ టెక్నాలజీ, నిఘా పరికరాలతో ఈ విభాగాన్ని బలోపేతం చేసింది. కేవలం డ్రగ్స్ విక్రయించే వారినే కాకుండా, వాటిని కొనుగోలు చేసే వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన వారిని, ముఖ్యంగా మొదటిసారి అలవాటు పడిన వారిని కౌన్సిలింగ్ నిమిత్తం రిహాబిటేషన్ సెంటర్లకు తరలించి డ్రగ్స్ వల్ల దుష్ప్రరిణామాలను వివరించి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ వెనకాడకుండా అరెస్టులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన మంగళహాట్, పురానాపూల్ పరిసరాల్లో జరిగిన అరెస్టులే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్లోని ధూల్పేట్, మంగళహాట్, పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్లోని పబ్లు, పార్టీలు జరిగే ప్రాంతాలపై టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు నిరంతర నిఘా ఉంచారు. గంజాయి, హాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Frequently Asked Questions
హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కేసులో ఎవరు పట్టుబడ్డారు?
పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు ఏమి స్వాధీనం చేసుకున్నారు?
పోలీసులు 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు మరియు 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టింది. TG-NAB ను బలోపేతం చేసి, విక్రయించే వారితో పాటు కొనుగోలు చేసే వారిపై నిఘా పెడుతోంది.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిని పోలీసులు ఏం చేస్తున్నారు?
పట్టుబడిన వారిని వైద్య పరీక్షల అనంతరం రిహాబిటేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. మొదటిసారి అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























