అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - బంధువుల దుష్ప్రచారంతో నవ దంపతుల సెల్ఫీ సూసైడ్, ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి

Telangana News: బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ నవ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Couple Forceful Death In Nizamabad: నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన నవ దంపతులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ పోలీసులకు వీడియో పంపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ (Pothangal) మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వారు కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు.

చనిపోతున్నామంటూ వీడియో

బంధువులు తమపై చేసిన దుష్ప్రచారం వల్లే మనస్తాపంతో ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. శైలజ ఓ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్ కుమార్‌కు ఓ వీడియో పంపించారు. 'గతంలో నేను ఓ తప్పు చేశాను. ఆ తప్పును నా భర్త, అత్తమామలు క్షమించారు. ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలామందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేము చెప్పినా బందువులతో పాటు ఇతరులకూ చెబుతోంది. ఆమె మాటలు విన్న బంధువులు ఏదేదో మాట్లాడితే నా భర్త ఇటీవలే పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. మా పిన్ని వల్లే చనిపోతున్నాం.' అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.

రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా..

ఈ వీడియోపై స్పందించిన కోటగిరి ఎస్సై సందీప్.. వీడియోతో పాటు సెల్ ఫోన్ నెంబరును నవీపేట ఎస్సైకి పంపించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక బాసర వంతెన వద్ద గాలించారు. అక్కడ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫోన్ నెంబరను ట్రాక్ చేశారు. ఈ క్రమంలో ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి గాలించగా పట్టాలపై విగతజీవులుగా కనిపించారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు రైల్వే ఉద్యోగి

అటు, జనగామ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడి ఆర్ధిక ఇబ్బందులతో ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన దేవర రాజు (38) రైల్వే ఉద్యోగి. ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని స్టేషన్‌కు కొద్దిదూరంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..

మరోవైపు, వరంగల్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వసంతాపూర్ గ్రామానికి చెందిన రాళ్లపల్లి అయిలయ్య (55) కొంతకాలంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటి వద్దే ఉంటుండగా.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అయిలయ్య సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget