అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - బంధువుల దుష్ప్రచారంతో నవ దంపతుల సెల్ఫీ సూసైడ్, ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి

Telangana News: బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ నవ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Couple Forceful Death In Nizamabad: నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన నవ దంపతులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ పోలీసులకు వీడియో పంపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ (Pothangal) మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వారు కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు.

చనిపోతున్నామంటూ వీడియో

బంధువులు తమపై చేసిన దుష్ప్రచారం వల్లే మనస్తాపంతో ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. శైలజ ఓ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్ కుమార్‌కు ఓ వీడియో పంపించారు. 'గతంలో నేను ఓ తప్పు చేశాను. ఆ తప్పును నా భర్త, అత్తమామలు క్షమించారు. ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలామందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేము చెప్పినా బందువులతో పాటు ఇతరులకూ చెబుతోంది. ఆమె మాటలు విన్న బంధువులు ఏదేదో మాట్లాడితే నా భర్త ఇటీవలే పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. మా పిన్ని వల్లే చనిపోతున్నాం.' అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.

రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా..

ఈ వీడియోపై స్పందించిన కోటగిరి ఎస్సై సందీప్.. వీడియోతో పాటు సెల్ ఫోన్ నెంబరును నవీపేట ఎస్సైకి పంపించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక బాసర వంతెన వద్ద గాలించారు. అక్కడ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫోన్ నెంబరను ట్రాక్ చేశారు. ఈ క్రమంలో ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి గాలించగా పట్టాలపై విగతజీవులుగా కనిపించారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు రైల్వే ఉద్యోగి

అటు, జనగామ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడి ఆర్ధిక ఇబ్బందులతో ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన దేవర రాజు (38) రైల్వే ఉద్యోగి. ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని స్టేషన్‌కు కొద్దిదూరంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..

మరోవైపు, వరంగల్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వసంతాపూర్ గ్రామానికి చెందిన రాళ్లపల్లి అయిలయ్య (55) కొంతకాలంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటి వద్దే ఉంటుండగా.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అయిలయ్య సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Embed widget