అన్వేషించండి

Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు

బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు. ఇదేదొ సినిమా దొంగతనం కాదు. బిర్యానీ అంటే పడిచచ్చిపోయే ఈ బాలుడిపై ఒకే పీఎస్ లో పది కేసులు నమోదయ్యాయంటే... వీడు మామూలోడు కాదని తెలుస్తుంది కదా.

హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరు. ఇక్కడికి ఎవరు వచ్చిన బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ బిర్యానీ అంటే పడి చచ్చిపోయే ఓ బాలుడు.. బిర్యానీ కోసం ఏకంగా దొంగగా మారిపోయాడు. బిర్యానీతో చిరుతిళ్లకు అలవాడు పడి చోరీలు మొదలుపెట్టాడు. రోజూ బిర్యానీ కొనేందుకు డబ్బులు లేవు. కూలి పనుల ద్వారా వస్తున్న డబ్బు తన తిండికి సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 

Also Read: States Monitize : తెలుగు రాష్ట్రాలూ మానిటైజ్ ! కేంద్రం ప్రైవేటుకు ఇవ్వబోతున్న రోడ్లు, రైల్వే స్టేషన్ల జాబితా ఇదిగో..!

తిండి కోసం దొంగతనాలు

తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తుతో హోటల్​కెళ్లి బిర్యానీ కుమ్మేస్తున్నాడు. మిగిలిన డబ్బుతో చిరుతిళ్లు తినేవాడు. ఇలా బిర్యానీ కోసం దొంగలా మారిపోయాడు. చిరుతిళ్లు తింటూ దొంగతనాలు ఎలా చేయాలో ఆలోచించేవాడు. కేవలం రుచికరమైన తిండి కోసం దొంగతనం చేస్తున్న ఈ దొంగ వయసు పదమూడేళ్లే.
 
ఒకే పీఎస్ లో 10 కేసులు

ఆ బాలుడి వయస్సు 13 ఏళ్లే కానీ అతనిపై ఒక్క పీఎస్ పరిధిలోనే 10 చోరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అంజనాద్రినగర్‌లో చోరీకి పాల్పడుతుండగా బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా ఆర్నెల్ల వ్యవధిలోనే హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. చోరీలకు పాల్పడుతుంది చేయి తిరిగిన దొంగ అనుకున్న పోలీసులు బాలుడ్ని చూసి ఆశ్చర్యపోయారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగించాయి.  

Also Read: Andhra Pradesh:మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు..శేషవస్త్రం సమర్పించిన టీటీడీ

 

బిహార్ చెందిన బాలుడు

హయత్ నగర్ పరిధిలో ఈ బాలుడిపై పది కేసులు నమోదైనట్లు తేలింది. హయత్‌నగర్‌ సీఐ సురేందర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన బాలుడు కూలి పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూరు అంజనాద్రి నగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం ఓ ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. బంగారం, వెండి, ఫోన్ చోరీకి గురయ్యాయని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60 వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4 వేలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో ఒకసారి బాల నేరస్థుల హోమ్ కి

బిర్యానీ, చిరుతిళ్లకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేస్తున్నట్లు విచారణలో బాలుడు తెలిపాడు. గతంలో ఒకసారి బాలుడ్ని అదుపులోకి తీసుకుని బాలనేరస్థుల గృహానికి పంపామని పోలీసులు తెలిపారు. విడుదలైన తర్వాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

Also Read: Three Capital Govt Plan : మూడు రాజధానులపై ఇప్పటికైతే వెనక్కి తగ్గినట్లే ! ప్రభుత్వం తర్వాతి వ్యూహం ఏమిటి..?

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget