అన్వేషించండి

Kappatralla Murder Case: కప్పట్రాళ్ల హత్య కేసు - వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు

Andhrapradesh News: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల హత్యాకాండకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటించింది.

AP High Court Verdict On Kappatralla Murder Case: ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన కర్నూలు (Kurnool) జిల్లా కప్పట్రాళ్ల హత్యాకాండకు (Kappatralla Murder Case) సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు గురి కాగా.. ఈ కేసులో జీవిత ఖైదు పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17 మంది నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు ఆదోని కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షను రద్దు చేసింది. నేర నిరూపణకు నిందితులపై పోలీసుల సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవన్న వారి తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వారికి విముక్తి కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

ఇదీ జరిగింది

ఉమ్మడి ఏపీలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పాలెగారి వెంకటప్పనాయుడు, మాదాపురం మద్దిలేటినాయుడి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఈ క్రమంలో 2008, మే 17న వెంకటప్పనాయుడితో పాటు మరో 10 మంది దారుణ హత్యకు గురయ్యారు. బోదెపాడు వద్ద వీరిని వాహనాలతో ఢీకొట్టి, బాంబులు విసిరి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై విచారించిన పోలీసులు మద్దిలేటినాయుడు సహా మరికొందరిపై హత్య కేసు నమోదు చేశారు.

అనంతరం హత్యా నేరం నిరూపణ కావడంతో ఆదోని రెండో సెషన్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు 17 మందికి జీవిత కాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. 2014, డిసెంబర్ 10న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఇటీవలే తీర్పు వాయిదా వేసింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రద్యుమ్నకుమార్ రెడ్డి, పి.వీరారెడ్డి, న్యాయవాదులు కైలాసనాథరెడ్డి, డి.కోదండరామరెడ్డి, చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టు ముందు ఉంచిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని తెలిపారు. వీరి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ కేసులో దోషులను నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, జీవితఖైదు పడిన వారిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు. తాజా తీర్పుతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

Also Read: Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Embed widget