అన్వేషించండి

IDC లెక్కకు భిన్నంగా యమహా EC-06 పనితీరు - ఒక్క ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్లిందో తెలుసా?

యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్‌లో ఒక్క ఛార్జ్‌తో 114 కిలోమీటర్లు ప్రయాణించింది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సమయం, పనితీరు & కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Yamaha EC-06 Price And Features: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో యమహా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా EC-06ను పరిచయం చేసింది. రివర్ ఇండీ ఆధారంగా దీనిని రూపొందించినప్పటికీ, డిజైన్‌లో యమహా ప్రత్యేకతను ప్రతిబింబించేలా మార్పులు చేసింది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.71 లక్షలుగా ఉన్న ఈ స్కూటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ పడుతోంది. కంపెనీ ప్రకటించిన IDC రేంజ్ 169 కిలోమీటర్లు కాగా, తాజాగా నిర్వహించిన రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

యమహా EC-06లో 4kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 6.7kW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే మిడ్ మౌంటెడ్ మోటార్‌తో పనిచేస్తుంది. రియల్ వరల్డ్ టెస్ట్ సమయంలో స్కూటర్‌ను స్టాండర్డ్ రైడింగ్ మోడ్‌లో నడిపారు. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు డిస్‌ప్లేపై మిగిలిన రేంజ్ 93 కిలోమీటర్లుగా కనిపించింది. అయితే వాస్తవ ప్రయాణంలో ఈ స్కూటర్ మొత్తం 114 కిలోమీటర్లు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ టెస్ట్ ప్రకారం ప్రతి 10 శాతం బ్యాటరీ ఛార్జ్ తగ్గినప్పుడు సగటున 11.4 కిలోమీటర్లు ప్రయాణించింది. మొత్తం లెక్క ప్రకారం, స్కూటర్ సామర్థ్యం ప్రతి kWh కి 28.5 కిలోమీటర్లుగా నమోదైంది. కంపెనీ చూపించిన డిస్‌ప్లే అంచనాతో పోలిస్తే వాస్తవ రేంజ్ ఎక్కువగా రావడం గమనార్హం. అయితే రైడింగ్ విధానం, టైర్ గాలి ఒత్తిడి, ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై రేంజ్ మారే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

నగర ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువగా పనిచేయడం వల్ల బ్యాటరీ వినియోగం నెమ్మదిగా జరిగింది. హైవేపై ఎక్కువ వేగంతో నడిపినప్పుడు బ్యాటరీ వేగంగా తగ్గింది. ఇది అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా కనిపించే లక్షణమే.

పనితీరు విషయానికి వస్తే బ్యాటరీ ఛార్జ్ 20 శాతం కంటే తక్కువకు వచ్చినా స్కూటర్ పనితీరులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఫ్లైఓవర్లను సులభంగా ఎక్కడం & ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. బ్యాటరీ 10 శాతం కంటే తక్కువకు వచ్చిన తర్వాత మాత్రమే పనితీరులో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

బ్యాటరీ ఛార్జ్ 5 శాతం కంటే తక్కువకు చేరుకున్నప్పుడు స్కూటర్ ఆటోమేటిక్‌గా ఎకో మోడ్‌కు మారింది. ఈ దశలో యాక్సిలరేషన్ & గరిష్ఠ వేగం తగ్గినా గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగింది. చివరకు బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత స్కూటర్ ముందుకు కదల్లేదు. అయితే డిస్‌ప్లే, సీట్ రిలీజ్ & ఛార్జర్ రిలీజ్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఫంక్షన్లు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ

ఈ స్కూటర్ బరువు 132 కిలోలు కావడం మరో ప్రత్యేకత. ఇది దేశంలోని అత్యంత బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. అలాగే, 14 అంగుళాల పెద్ద చక్రాలు & వెడల్పాటి టైర్లు ఉండటం వల్ల రైడ్ నాణ్యత మెరుగ్గా ఉన్నప్పటికీ రేంజ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంత నిరాశ కలిగించే అంశం ఉంది. యమహా EC-06తో కేవలం 450W ఛార్జర్ మాత్రమే అందిస్తోంది. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తమ రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ప్రీమియం ఫీచర్లు, మంచి రియల్ వరల్డ్ రేంజ్ & స్థిరమైన పనితీరుతో యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
సెకండ్‌హ్యాండ్ Maruti Brezza కొంటున్నారా? ఈ సమస్యలు ఉన్నాయేమో ముందే చెక్ చేయండి
కొత్త కారు కంటే తక్కువ ధరకే Maruti Brezza.. కొనే ముందు ఈ విషయాలను మర్చిపోవద్దు
Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి
రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి
రూ.2 లక్షలు చెల్లించి Maruti Victoris CNG తీసుకుంటే చెల్లించాల్సిన EMI లెక్కలు ఇవే
రూ.2 లక్షలు చెల్లించి Maruti Victoris CNG తీసుకుంటే చెల్లించాల్సిన EMI లెక్కలు ఇవే
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget