అన్వేషించండి

Toll Hike: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ధరలు..! క్యాష్ పేమెంట్స్ ఇక బంద్!!

Toll Hike: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలపై 5 శాతం వరకు భారం పడటంతో పాటు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు కూడా పెరిగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్ ధరలు 5% పెరుగుతాయి.
  • టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేసి, ఫాస్టాగ్ తప్పనిసరి.
  • కొన్ని రాష్ట్రాల రహదారులపై కూడా టోల్ ఫీజులు పెంచారు.
  • వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర రూ. 3,000 నుంచి రూ. 3,075 కు చేరనుంది.

Toll Hike: వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఖరీదు కానుంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi NCR) పరిధిలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారు అదనపు భారం మోయక తప్పదు. ఉదాహరణకు ఒక సింగిల్ ట్రిప్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 170 నుండి రూ. 177 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో రెగ్యులర్ గా ప్ర‌యాణాలు చేసే వారి జేబుల‌కు చిల్లు ప‌డ‌టం ఖాయంగా మారింది. 

క్యాష్ పేమెంట్స్ ఇక చెల్లవు

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు (Cash) రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిట‌ల్ చెల్లింపులను ప్రొత్స‌హిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పెద్ద‌మొత్తంలో న‌గ‌దు లావాదేవీల‌ను కూడా కేంద్రం నిరుత్సాహ‌ప‌రుస్తోంది. ఒక ప‌రిధికంటే ఎక్కువ దాటిన న‌గ‌దు లావాదేవీల‌పై ప‌న్నులు కూడా విధిస్తోంది. 

రాష్ట్రాల వారీగా ధరల పెంపు

కేవలం జాతీయ రహదారులే కాకుండా కొన్ని రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై 3 నుండి 5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తమిళనాడులో కూడా ఈస్టర్ కోస్ట్ రోడ్, మదురై రింగ్ రోడ్ సహా మొత్తం 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ పెంపు వల్ల ట్రావెల్ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ భారం

నిత్యం టోల్ గేట్ల గుండా ప్రయాణించే వారి కోసం ఇచ్చే ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను ప్రభుత్వం భారీగా సవరించింది. ప్రస్తుతం 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 ధర ఏప్రిల్ 1 నుండి ఏకంగా రూ. 3,075 కు చేరనుంది. అయితే ఈ వార్షిక పాస్ కేవలం నేషనల్ హైవేల మీద మాత్రమే పని చేస్తుంది. ఓవ‌రాల్ ఒక ప్ర‌యాణానికి కేవ‌లం 15 రూపాయ‌లు చెల్లించి, చౌక‌గా ప్ర‌యాణించే అవ‌కాశాన్ని ఈ పాస్ అందిస్తోంది. ఇక‌, స్టేట్ హైవేలు, కొన్ని ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్‌వేల వద్ద ఇది చెల్లదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనదారులు తమ ప్రయాణ ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం మంచిదని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

ఏప్రిల్ 1 నుండి టోల్ ధరలు ఎంత పెరగనున్నాయి?

వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు కొనసాగుతాయా?

లేదు, ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 వార్షిక పాస్ ధర ఏప్రిల్ 1 నుండి రూ. 3,075 కు పెరగనుంది.

ఏ రాష్ట్రాలలో టోల్ ఫీజులు పెరుగుతున్నాయి?

కేవలం జాతీయ రహదారులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, తమిళనాడులో 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే
Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే
Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
Advertisement

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
Peddi Pre Release Event Live Highlights: చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Dhurandhar Washma Butt Chai Shop Real Location: ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Embed widget