వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్ప్రెస్వేలు, జాతీయ రహదారులపై టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Toll Hike: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ధరలు..! క్యాష్ పేమెంట్స్ ఇక బంద్!!
Toll Hike: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్వేలపై 5 శాతం వరకు భారం పడటంతో పాటు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు కూడా పెరిగాయి.

- ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్ ధరలు 5% పెరుగుతాయి.
- టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేసి, ఫాస్టాగ్ తప్పనిసరి.
- కొన్ని రాష్ట్రాల రహదారులపై కూడా టోల్ ఫీజులు పెంచారు.
- వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర రూ. 3,000 నుంచి రూ. 3,075 కు చేరనుంది.
Toll Hike: వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్ప్రెస్వేలు, జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఖరీదు కానుంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi NCR) పరిధిలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేలపై ప్రయాణించే వారు అదనపు భారం మోయక తప్పదు. ఉదాహరణకు ఒక సింగిల్ ట్రిప్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 170 నుండి రూ. 177 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో రెగ్యులర్ గా ప్రయాణాలు చేసే వారి జేబులకు చిల్లు పడటం ఖాయంగా మారింది.
క్యాష్ పేమెంట్స్ ఇక చెల్లవు
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు (Cash) రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రొత్సహిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దమొత్తంలో నగదు లావాదేవీలను కూడా కేంద్రం నిరుత్సాహపరుస్తోంది. ఒక పరిధికంటే ఎక్కువ దాటిన నగదు లావాదేవీలపై పన్నులు కూడా విధిస్తోంది.
రాష్ట్రాల వారీగా ధరల పెంపు
కేవలం జాతీయ రహదారులే కాకుండా కొన్ని రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే, బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్డుపై 3 నుండి 5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తమిళనాడులో కూడా ఈస్టర్ కోస్ట్ రోడ్, మదురై రింగ్ రోడ్ సహా మొత్తం 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ పెంపు వల్ల ట్రావెల్ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ భారం
నిత్యం టోల్ గేట్ల గుండా ప్రయాణించే వారి కోసం ఇచ్చే ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను ప్రభుత్వం భారీగా సవరించింది. ప్రస్తుతం 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 ధర ఏప్రిల్ 1 నుండి ఏకంగా రూ. 3,075 కు చేరనుంది. అయితే ఈ వార్షిక పాస్ కేవలం నేషనల్ హైవేల మీద మాత్రమే పని చేస్తుంది. ఓవరాల్ ఒక ప్రయాణానికి కేవలం 15 రూపాయలు చెల్లించి, చౌకగా ప్రయాణించే అవకాశాన్ని ఈ పాస్ అందిస్తోంది. ఇక, స్టేట్ హైవేలు, కొన్ని ప్రైవేట్ ఎక్స్ప్రెస్వేల వద్ద ఇది చెల్లదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనదారులు తమ ప్రయాణ ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Frequently Asked Questions
ఏప్రిల్ 1 నుండి టోల్ ధరలు ఎంత పెరగనున్నాయి?
టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు కొనసాగుతాయా?
లేదు, ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలో ఏమైనా మార్పులు ఉన్నాయా?
అవును, 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 వార్షిక పాస్ ధర ఏప్రిల్ 1 నుండి రూ. 3,075 కు పెరగనుంది.
ఏ రాష్ట్రాలలో టోల్ ఫీజులు పెరుగుతున్నాయి?
కేవలం జాతీయ రహదారులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే, తమిళనాడులో 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు





















