అన్వేషించండి

Toll Hike: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ధరలు..! క్యాష్ పేమెంట్స్ ఇక బంద్!!

Toll Hike: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలపై 5 శాతం వరకు భారం పడటంతో పాటు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు కూడా పెరిగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్ ధరలు 5% పెరుగుతాయి.
  • టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేసి, ఫాస్టాగ్ తప్పనిసరి.
  • కొన్ని రాష్ట్రాల రహదారులపై కూడా టోల్ ఫీజులు పెంచారు.
  • వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర రూ. 3,000 నుంచి రూ. 3,075 కు చేరనుంది.

Toll Hike: వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఖరీదు కానుంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi NCR) పరిధిలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారు అదనపు భారం మోయక తప్పదు. ఉదాహరణకు ఒక సింగిల్ ట్రిప్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 170 నుండి రూ. 177 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో రెగ్యులర్ గా ప్ర‌యాణాలు చేసే వారి జేబుల‌కు చిల్లు ప‌డ‌టం ఖాయంగా మారింది. 

క్యాష్ పేమెంట్స్ ఇక చెల్లవు

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు (Cash) రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిట‌ల్ చెల్లింపులను ప్రొత్స‌హిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పెద్ద‌మొత్తంలో న‌గ‌దు లావాదేవీల‌ను కూడా కేంద్రం నిరుత్సాహ‌ప‌రుస్తోంది. ఒక ప‌రిధికంటే ఎక్కువ దాటిన న‌గ‌దు లావాదేవీల‌పై ప‌న్నులు కూడా విధిస్తోంది. 

రాష్ట్రాల వారీగా ధరల పెంపు

కేవలం జాతీయ రహదారులే కాకుండా కొన్ని రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై 3 నుండి 5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తమిళనాడులో కూడా ఈస్టర్ కోస్ట్ రోడ్, మదురై రింగ్ రోడ్ సహా మొత్తం 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ పెంపు వల్ల ట్రావెల్ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ భారం

నిత్యం టోల్ గేట్ల గుండా ప్రయాణించే వారి కోసం ఇచ్చే ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను ప్రభుత్వం భారీగా సవరించింది. ప్రస్తుతం 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 ధర ఏప్రిల్ 1 నుండి ఏకంగా రూ. 3,075 కు చేరనుంది. అయితే ఈ వార్షిక పాస్ కేవలం నేషనల్ హైవేల మీద మాత్రమే పని చేస్తుంది. ఓవ‌రాల్ ఒక ప్ర‌యాణానికి కేవ‌లం 15 రూపాయ‌లు చెల్లించి, చౌక‌గా ప్ర‌యాణించే అవ‌కాశాన్ని ఈ పాస్ అందిస్తోంది. ఇక‌, స్టేట్ హైవేలు, కొన్ని ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్‌వేల వద్ద ఇది చెల్లదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనదారులు తమ ప్రయాణ ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం మంచిదని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

ఏప్రిల్ 1 నుండి టోల్ ధరలు ఎంత పెరగనున్నాయి?

వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు కొనసాగుతాయా?

లేదు, ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 వార్షిక పాస్ ధర ఏప్రిల్ 1 నుండి రూ. 3,075 కు పెరగనుంది.

ఏ రాష్ట్రాలలో టోల్ ఫీజులు పెరుగుతున్నాయి?

కేవలం జాతీయ రహదారులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, తమిళనాడులో 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget