కియా గ్రీన్ మొబిలిటీ వైపు దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రధానంగా మార్చుకోవాలని, 2030 నాటికి తమ అమ్మకాలలో 25% హైబ్రిడ్ వాహనాల ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Kia Hybrid SUVs: అనంతపురం నుంచి సరికొత్త హంగులతో రానున్న సెల్టోస్, సోరెంటో! త్వరలోనే కియో హైబ్రిడ్ ఎస్యూవీ సందడి!
Kia Hybrid SUVs:కియా ఇండియా సరికొత్త హంగులతో రెండు వాహనాలను భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. మెరుగైన మైలేజ్, అధునాతన ట్రినిడీ డిస్ప్లే, గ్లోబల్ కే3 ప్లాట్ఫామ్తో ఈ వాహనాలు అలరించనున్నాయి.

- కియా హైబ్రిడ్ వాహనాల వైపు దృష్టి సారిస్తోంది.
- సోరెంటో 7-సీటర్ హైబ్రిడ్ 2026లో విడుదల కానుంది.
- సెల్టోస్ హైబ్రిడ్ 2027లో 25 కి.మీ. మైలేజీతో రానుంది.
- అనంతపురంలో బ్యాటరీల తయారీతో ధరల తగ్గింపు ప్రణాళిక.
Kia Hybrid SUVs:భారత ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేసుకున్న కియా ఇప్పుడు గ్రీన్ మొబిలిటీ దిశగా భారీగా అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్లకే పరిమితం కాకుండా, రాబోయే కాలంలో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రధానంగా మార్చుకోవాలని కియా నిర్ణయించుకుంది. ముఖ్యంగా భారత మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన సెల్టోస్ ఎస్యూవీలో హైబ్రిడ్ వెర్షన్ను ప్రవేశ పెట్టడం ద్వారా మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
భారత్లో ఉద్గారాల నిర్వహణ రూల్స్ కఠింగా మారుతున్నాయి. దీనికి తోడు వినియోగదారులు కూడా తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. డీజిల్ ఇంజన్లపై శ్రద్ధను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ల మార్కెట్లో మంచి ఆదరణ పొందుతాయని కియా భావిస్తోంది. వీటి వల్ల మార్కెట్లో పోటీలో నిలబడటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసినట్టు అవుతుందని, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండా ఈవీ అనుభూతి అందిస్తాయని ఆలోచిస్తోంది.
కియా తన ఇన్వెస్టర్ మీటింగ్లో 2030 నాటికి తన విక్రయాల్లో 25 శాతాన్ని హైబ్రిడ్ వాహనాల ద్వారా సాధించాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందు కోసం కంపెనీ భారీగా లోకలైజేషన్పై దృష్టి పెట్టింది. బ్యాటరీ ప్యాక్లు, మోటార్లు, ఎలక్ట్రానిక్ భాగాలను భారత్లోనే తయారు చేయడం ద్వారా ధరలను అందుబాటులో ఉంచాలని కియా భావిస్తోంది.
సోరెంటో హైబ్రిడ్తో మొదటి అడుగు వేసిన కియా
భారత్లో కియా విడుదల చేయబోయే తొలి హైబ్రిడ్ ఎస్యూవీ సోరెంటో 7 సీటర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షలు జరుపుతోంది. సోరెంటో ఒక ప్రీమియం డీ-ఎస్యూవీ విభాగంలో వస్తుంది. ఇది బాక్సీ లుక్, టైగర్ నోస్ గ్రిల్, టీ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్లతో గంభీరంగా కనిపిస్తుంది. దీని లోపల 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్, బోస్ సౌండ్ సిస్టమ్, లెవల్ 2 అడాస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.
ఇందులో 1.5 లీటర్ల హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ చిన్న బ్యాటరీ ప్యాక్తో కలిసి పని చేస్తుంది. దీనికి సీవీటీ లేదా డీసీటీ గేర్ బాక్స్ జత చేయవచ్చు. సోరెంటో హైబ్రిడ్ ధర పాతిక లక్షల నుంచి 35 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ఇది 2026 పండగ సీజన్ నాటికి మార్కెట్లోకి రానుంది.
నెక్స్ట్ జనరేషన్ సెల్టోస్ 2027 హైబ్రిడ్
కియా ఇండియాకు వెన్నముక వంటి సెల్టోస్ ఇప్పుడు రెండో తరంలోకి అడుగు పెడుతోంది. 2027 మోడ్ సెల్టోస్ ేవలం హైబ్రిడ్ ఇంజన్కే పరిమితం కాకుండా డిజైన్, టెక్నాలజీ పరంగా పూర్తిగా మారిపోనుంది. ఇది గ్లోబల్ కే 3 ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంది. దీని వల్ల వాహనం పటుత్వం 20 శాతం పెరుగుతుంది. ఇది భద్రతను మెరుగుపరుస్తుంది. దీని పొడవు 4, 460 ఎంఎం ఉంది. 2,690 ఎంఎం వల్ల వెనుక సీట్లో కూర్చొనే ప్రయాణికులకు లెగ్ రూమ్ పెరుగుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 206 ఎంఎంకు పెరిగింది. ఇది ఆఫ్రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
సెల్టోస్ ఇంటీరియర్లో అతి పెద్ద ఆకర్షణ ట్రినిడీ డిస్ప్లే. ఇది దాదాపు 30 అంగుళాల డిజిటల్ స్క్రీన్స్పేస్ను కలిగి ఉంటుంది. 12.3 అంగుళాల ఇన్ఫ్టైన్మెంట్ స్క్రీన్, 123 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లై. ఐదు అంగుళాల ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో వెనిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ సౌకర్యాలు ఉన్నాయి.
హైబ్రిడ్ ఇంజిన్ మైలేజు ఎలా ఉంటుంది?
గ్లోబల్ మార్కెట్లో 1.6 లీటర్ ఇంజిన్ ఉన్నప్పటికీ భార్త కోసం కియా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను హైబ్రిడ్ సిస్టమ్తో జత చేసే ఛాన్స్ ఉంది. సెల్టోస్ లీటరుకు 0 నుంచి 25 కిలోమీటర్ల మైలేజు ఇవ్వగలదు. సెల్టోస్ మొదటిసారిగా ఎలక్ట్రిక్ అలోవీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయం చేయనుంది. ఇందులో వెనుక చక్రాలకు ప్రత్యేక ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తి అందుతుంది. రఫ్ రోడ్లలో కూడా వాహనాన్ని అదనపు గ్రిప్ లభిస్తుంది.
అనంతపురంలో తయారీ- ధర సంగతి ఏంటీ?
హైబ్రిడ్ వాహనాల ధరలు పెరగకుండా ఉండేందుకు కియా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంట్లోనే లిథియం- ఐరన్- పాస్పేట్ బ్యాటరీ సెల్స్ను తయారు చేయనున్నారు. LFP బ్యాటరీలు భారత వాతావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా తక్కువ ధరలో లభిస్తాయి. దీన్ని 2026 చివరి నాటికి విడుదల చేస్తారు. దీని ధర 18 లక్షల నుంచి పాతిక లక్షల మధ్య ఉంటుంది.
Frequently Asked Questions
భారత మార్కెట్ లో కియా యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
భారత్ లో కియా విడుదల చేయబోయే మొదటి హైబ్రిడ్ SUV ఏది?
భారత్ లో కియా విడుదల చేయబోయే తొలి హైబ్రిడ్ SUV సోరెంటో 7 సీటర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షలు జరుపుతోంది.
కియా సెల్టోస్ హైబ్రిడ్ ఎప్పుడు మార్కెట్లోకి రానుంది?
కియా సెల్టోస్ యొక్క నెక్స్ట్ జనరేషన్ మోడల్ 2027 నాటికి హైబ్రిడ్ ఇంజిన్ తో రానుంది. ఇది డిజైన్, టెక్నాలజీ పరంగా కూడా మార్పులతో రానుంది.
హైబ్రిడ్ వాహనాల ధరలను అందుబాటులో ఉంచడానికి కియా ఏమి చేస్తోంది?
కియా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా అనంతపురం ప్లాంట్ లోనే లిథియం- ఐరన్- పాస్పేట్ బ్యాటరీ సెల్స్ ను తయారు చేయనుంది.
ట్రెండింగ్ వార్తలు






















