అన్వేషించండి

మంత్రులు, నేతలను చంపాలన్న కుట్రతోనే దాడి: విశాఖ సీపీ 

Vizag News: విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అనుమతి లేకుండా 300 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడినట్లు అధికారులు సీపీ తెలిపారు.

Vizag News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. విశాఖ గర్జన పేరుతో నిర్వహించిన ర్యాలీ మొత్తం ఉద్రిక్తంగానే సాగింది. ర్యాలీ ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడులు చేశారని వెల్లడించారు. 

విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అనుమతి లేకుండా 300 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడినట్లు అధికారులు తెలిపారు. మంత్రి ఆర్కే రోజా తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులను అగౌరవపరిచేలా అసభ్యకర పదజాలం వాడారని.. అంతే కాకుండా వారిని చంపాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ నియమ నిబంధనలు అన్నీ అతిక్రమించారని తెలిపారు. 

నాయకులు, కార్యకర్తలపై కేసులు..

పెందుర్తి ఎస్.హెచ్.వో నాగేశ్వర రావుపై, సిబ్బందిపై దాడికి జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ వెల్లడించారు. మున్నంగి దిలీప్ కుమార్, సాయి కిరణ్, సిద్ధు, హరీశ్ లాంటి సామాన్య ప్రజలపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో వారికి గాయాలు కూడా అయ్యాయని గుర్తించారు. జనసే కార్యకర్తల చర్యలతో విశాఖ విమానాశ్రయం వద్ద స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయని చాలా మంది వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు విమానాలను మిస్ చేసుకున్నారని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయిన జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టినట్లు విశాఖ సీపీ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..?

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. వైసీపీ నేతలు నిర్వహించిన విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకోగా అదే సమయంలో  మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జనసైనికుల పని అని, వైసీపీ నేతలు, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, రోజా ఆరోపించారు. జనసైనికులు ఎవరిపై దాడి చేయలేదని, తమ కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి అధికార వైసీపీ చేస్తున్న కుట్ర ఇది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తన పర్యటనను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే.. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానంటూ పోలీసులకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ గర్జన విఫలం చెందిందనే అక్కసుతోనే ప్రభుత్వం ర్యాలీ ఆపిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 

తమ చర్యలతో శాంతి భద్రతలకు భంగం కలిగించిన, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసిన జనసేన శ్రేణులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేనన కార్యకర్తలను గుర్తించి పట్టుకున్నారు. విశాఖపట్నం దాడి ఘటనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Embed widget