అన్వేషించండి

Botsa Satyanarayana: వీళ్లకి ‘అమ్మ ఒడి’ వర్తిస్తుందా? మంత్రి బొత్స క్లారిటీ - వీరికే వర్తింపు

విజయనగరంలో అమృత్‌ పథకంలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం రూ.1.96 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు.

అమ్మఒడి పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పథకం కోసం నిధుల కొరత ఏర్పడిందని, అందుకే లబ్ధిదారులను ప్రభుత్వం బాగా తగ్గించిందనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. అమ్మ ఒడి పథకం అర్హులైన వారు అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు స్కూలుకు వచ్చే హాజరు ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని బొత్స సత్యనారాయణ వివరించారు. అమ్మ ఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని ఈ పథకానికి విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామని వివరించారు.

విజయనగరంలో అమృత్‌ పథకంలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం రూ.1.96 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పంపి, హాజరు శాతం పెంచితే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని తెలిపారు. విజయనగరంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ను మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారని బొత్స వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఇంటర్‌లో ఫలితాలు ఏ మాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చారు. స్కూళ్లు, కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

అవసరమైతే డీఎస్పీ కూడా..
మరోవైపు, బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని చెప్పారు. అవసరమైతే డీఎస్సీ కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. 884 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2  జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు  తీసుకుంటున్నామని బొత్స చెప్పారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget