అన్వేషించండి

TTD Employees: ఇంటి దొంగలపై టీటీడీ కొరడా.. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఆరుగురిపై వేటు

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై చర్యలు చేపట్టిన టీటీడీ..సేవా టిక్కెట్ల అవకతవకల్లో ప్రమేయం ఉన్న ఇంటి దొంగలపై టీటీడీ కొరడా ఝలిపించింది. ఆరుగురిపై వేటు వేసింది.

తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు పరితప్పించి పోతుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని  దర్శించుకోవడానికి తిరుమలలో సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేకు దర్శనం ద్వారా దర్శించుకునే భాగ్యం లభిస్తోంది. వీరిలో వీఐపీ బ్రేక్ దర్శనం మినహా మిగిలిన భక్తులకు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం లభించేది ఆరు సెకండ్లు నుంచి పన్నెండు సెకండ్లు మాత్రమే కాగా శని, ఆదివారాలు మినహా స్వామి వారికి నిత్యం ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. సేవా సమయంలో స్వామి వారిని అరగంట నుంచి గంట సమయం పాటు ఎలాంటి ఆటంకాల లేకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం ఆర్జిత సేవా భక్తులకు లభిస్తుంది. ఇంతటి భాగ్యం లభించడంతో దేశంలో మరే ఇతర దేవాలయాల్లో లేనంత డిమాండ్ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు లభించింది. 

2070 వరకూ బల్క్ బుకింగ్ 

ఒకానొక్క సమయంలో తిరుమలకు వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసిన టీటీడీ.. అటు తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు తెచ్చి అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో 90 రోజుల ముందుగా రిజర్వ్ చేసుకునే పద్దతిని ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో టీటీడీ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి భక్తుల పంపిన డీడీలను తమ సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టిన విషయం వెలుగులోకి రావడంతో ఆర్జిత విభాగాన్ని టీటీడీ కంప్యూటరీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ లైన్, అడ్వాన్స్ రిజర్వేషన్, కరెంటు బుకింగ్ ద్వారా సేవా టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. అయితే అప్పటి వరకూ భక్తులే స్వయంగా తమకు అవసరమైన సేవా టికెట్లను అన్ లైన్, అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో పొందేవారు. 2004 నుంచి ఆర్జితంలో బల్క్ బుకింగ్ ప్రారంభమైంది. దీంతో టిక్కెట్ల జారీలోని లొసుగులను సొమ్ము చేసుకోవాలనుకున్న ఇంటి దొంగలు ఒకే వ్యక్తి,ఒకే కుటుంబానికి చెందిన వారిపై బల్క్ బుకింగ్ ప్రారంభించారు. సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం,వస్త్రం సేవలను కుప్పలు తెప్పలుగా సంపన్నులకు జారీ చేశారు టీటీడీ సిబ్బంది. ఇందులో ఉస్మానాబాద్ కు చెందిన కటికర్ అనే వ్యక్తికి 30 వేల సేవా టికెట్లను కేటాయించారంటే బల్క్ బుకింగ్ ఏ స్ధాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 2010 లెక్కల ప్రకారం అర్జితం విభాగంలో  సుప్రభాతం, అర్చన, తోమాల సేవా టికెట్లు 2030 వరకూ శుక్రవారం జరిగే అభిషేకం టికెట్లు 2056వ సంవత్సరం వరకూ వస్త్రం సేవా టికెట్లు 2070 వరకూ బల్క్ బుకింగ్ ద్వారా రిజర్వు చేయించారు. అయితే 2008వ సంవత్సరం అక్టోబర్ నెలలో టీటీడీ విక్రయించిన వస్త్రం టిక్కెట్ల కంటే అదనంగా భక్తులు రావడంతో తొలిసారిగా ఆర్జిత లీలలు బయటకు వచ్చాయి.

భక్తుడు రిజర్వు చేసుకున్న టిక్కెట్టు తిరస్కరించినట్లు సమాచారం అందించిన ఆర్జిత సేవ సిబ్బంది వాటిని మరోకరికి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అటెండర్ నుంచి పర్యవేక్షకుడి స్థాయి అధికారి వరకు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తేలింది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు యాజమాన్యానికి నివేదిక అందించడంతో టీటీడీ యాజమాన్యం 6 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతటితో ఈ కేసు ముగిసిందని టీటీడీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు టిక్కెట్లు 70 వేల రూపాయలకు
2010 మే నెలలో 1500 రూపాయల విలువ చేసే రెండు అభిషేకం టిక్కెట్లను ఓ వ్యక్తి 70 వేల రూపాయలకు విక్రయించడంతో ఆర్జిత విభాగం ఆక్రమాలు మళ్లీ వెలుగు చూశాయి. ఈ ఘటనపై అప్పటి ఈవో ఐ.వై.ఆర్.కృష్ణారావు విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణంపై నివేదిక సమర్పించాలని కోరారు. దీంతో విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం ఈవోకు ప్రాథమిక నివేదిక సమర్పించగా... నివేదికను పరిశీలించిన ఈవో టిక్కెట్ల బుకింగ్ లో భారీ కుంభకోణం జరిగినట్లు నిర్ధారణకు వచ్చి ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి కేసును బదిలీ చేశారు. అప్పట్లో ఈ విషయం టీటీడీలో సంచలనం రేపింది. ఈ కేసు విషయంమై  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి చీఫ్ గా భాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నేతృత్వంలో ఓ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం టీటీడీలోని రికార్డులను పరిశీలించింది. 

సీఐడీ రంగంలోకి..
ఆర్జిత విభాగంతో పాటు సిఫార్సు ఉత్తరాలతో బల్క్ గా సేవా టిక్కెట్లను పొందిన వారిని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంచలన నివేదికను ప్రభుత్వానికి, టీటీడీకి సమర్పించింది. ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణం కేసులో 2004 నుంచి 2010 వరకూ టీటీడీ పాలకమండలి సభ్యులుగా పనిచేసిన వారితో సహా టీటీడీ ఉద్యోగులలో 56 మంది ప్రమేయం ఉందని టీటీడీకి నివేదికను ఇచ్చారు.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అందజేసిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, టీటీడీ యాజమాన్యం నిందితులపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకొని, ఆ మేరకు తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పటి అలయ డిప్యూటీ ఈవో గోపాలక్రిష్ణ 13 మందిపై ఫిర్యాదు చేశారు. టీటీడీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న సమయంలో ప్రభుత్వం కేసును సీఐడీకి బదిలీ చేసింది. కేసు సీఐడీకి బదిలీ కావడంతో తిరుమల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగ్గిన సీఐడీ అధికారులు తిరుమలలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పరిశీలించిన రికార్డులను తిరిగి పరిశీలించి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యానికి సమర్పించింది.

ఆర్జిత సేవ టిక్కెట్ల కుంభకోణం తెరపైకి

ఆర్జిత సేవ కుంభకోణంలో దర్యాప్తు అంశాన్ని ప్రక్కన పెట్టిన టీటీడీ అప్పటి వరకు టిక్కెట్లు నమోదు చేసుకునేందుకు ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం కారణంగా ఇంత భారీ కుంభకోణం చోటు చేసుకుందని నిర్ధారించుకొని ఆ తరువాత కాలంలో సేవా టిక్కెట్ల జారీ విధివిధానాలపై పూర్తి స్థాయిలో సమక్షించి టిక్కెట్లు నమోదు చేసుకునే విధానాలలో మార్పులు చేసింది. బల్క్ బుకింగ్ ను రద్దు చేసి ఒక్క భక్తుడు ఏడాదికి ఒక్క టిక్కెట్టు మాత్రం పొందడానికి అర్హుడని నిబంధనలు పెట్టింది. ఒకటి కంటే ఎక్కువ టిక్కెట్లను పొందిన వారిని రద్దు చేసి సామాన్య భక్తులకు లక్కి డిప్ ద్వారా పొందే ఏర్పాటు చేసింది.  దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్లను పొందే భాగ్యం దక్కింది. దీంతో ఆ తరువాత ‌కాలంలో ఈ కేసు మాత్రం మరుగున పడిపోయింది. గతేడాది ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో జవహార్ రెడ్డి టీటీడీలో పెండింగ్ లో ఉన్న కేసులపై దృష్టి సారించి పెండింగ్ కేసులన్నీ త్వరగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశాలు జారీ చేశారు.  దీంతో తిరిగి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం తెరపైకి వచ్చింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపించిన ఈవో జవహర్ రెడ్డి ఈ కేసులో ప్రత్యక్షంగా హస్తమున్న ప్రస్తుతం ఉద్యోగులుగా కొనసాగుతున్న ఆరుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

చర్యలకు రంగం సిద్ధం
ఇందులో ప్రస్తుతం సూపరింటెండెంట్లు హోదాలో వున్న సూర్యనారాయణరెడ్డి, చోడెం మధుసూధన్, సీనియర్ ఆసిస్టెంట్లు హేమాద్రిరెడ్డి, బాలకృష్ణ, జూనియర్ ఆసిస్టెంట్ నారాయణరాజు, అటెండర్ శ్రీనివాసులను సర్వీస్ నుంచి తొలగించగా.. అప్పట్లో ఆర్జిత విభాగంలో ఏఈవోగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోగా కోదండరామ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న పార్వతి దేవిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారస్సు చేశారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న రిటైర్డ్ అయినా పలువురు ఉద్యోగులకు అందుతున్న బెనిఫెట్స్ లో కోతను విధించడంతో పాటు పరోక్షంగా ప్రమేయం ఉన్న మరో 40 మంది ఉద్యోగులపై కూడా శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు. 

Also Read: Tirumala Tirupathi Devastanam: టీటీడీ గోవిందుని గోపథకం...పంచగవ్యాలతో సరికొత్త ఉత్పత్తులు తయారీ...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget