అన్వేషించండి

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఆగస్టు 1న పవిత్రోత్సవాల టికెట్లు ఆన్ లైన్ లో విడుదల

Tirumala Tickets : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు టీటీడీ భక్తులకు అవకాశం కల్పిస్తుంది. పవిత్రోత్సవాల టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Tirumala Tickets : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలను ఈ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.  ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మొత్తం 600 టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేయనున్నారు. భక్తులు రూ.2,500 చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గోవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాల్లో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వద్దకు చేరుకోవాలని టీడీపీ తెలిపింది. భక్తులు టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. 

ఆగస్టు 8 నుంచి 10 వరకు 

కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన పవిత్రోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది. 

పవిత్రోత్సవాలు అంటే?  

వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా క్రీ.శ 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంతో ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొంత కాలం పాటు పవిత్రోత్సవాలను నిర్వహించలేదు.  1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. 

పవిత్రోత్సవాల్లో ఏం జరుగుతుందంటే?

పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా అలంకరించి ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి‌ సమేత మలయప్ప స్వామిని తిరుమాఢ వీధిలో ఊరిగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. రెండో  రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. ముందు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు అనుబంధ ఆలయాల్లో విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది. 

పలు సేవలు రద్దు 

మొదటి రెండు రోజులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పవిత్రాలు సమర్పిస్తారు. మూడో రోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుభంద ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పూర్ణాహూతి ఇవ్వడంతో పవిత్రోత్సవాలు ఘట్టం ముగుస్తుంది. పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7వ తేదీన అంకురార్పణ సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఆగస్టు 9వ తేదీన అష్టదళ పాద పద్మారాధనతో పాటుగా ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు టీటీడీ రద్దు చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Amaravati Bill Rajya Sabha: అమరావతికి రాజ్యసభ జై - బీఆర్ఎస్సూ సపోర్టు - తర్వాత ప్రక్రియ ఇదే!
అమరావతికి రాజ్యసభ జై - బీఆర్ఎస్సూ సపోర్టు - తర్వాత ప్రక్రియ ఇదే!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget