అన్వేషించండి

Tension at Pulivendula YCP office: పులివెందుల వైసీపీ ఆఫీసు వద్ద టెన్షన్ - కాల్చిపారేస్తాన్న డీఎస్పీ - అసలేం జరిగిందంటే ?

Pulivendula YSRCP office: పులివెందుల వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంది. కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకోవడంతో డీఎస్పీ మురళీనాయక్ కాల్చిపడేస్తానని హెచ్చరించారు.

Pulivendula YSRCP office Police :  పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైసీపీ కార్యాలయం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉదయం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ఎర్రగంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం సమయంలో అవినాష్ రెడ్డి పోలీసులకు చెప్పకుండా వైఎస్ఆర్‌సీపీ ఆఫీసుకు వచ్చేశారు. దీంతో పోలీసులు ఆయనను వెదుక్కుంటూ పులివెందుల వైసీపీ ఆఫీసుకు వచ్చారు. డీఐజీ కోయ ప్రవీణ్ కూడా వైసీపీ ఆఫీసుకు వచ్చారు. ఆయన వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డం నిలబడ్డారు. వారిని తప్పించుకుని కార్యాలయం తలుపు వద్దకు వెళ్లినా కాసేపు తీయలేదు. 

అవినాష్ రెడ్డిని మరోసారి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు కూడా వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కొంత మంది కార్యకర్తలు పోలీసుల్ని లోపులకు వెళ్లడానికి అంగీకరించకుండా అడ్డం నిలబడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ  మురళీనాయక్ తో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆగ్రహం చెందిన డీఎస్పీ.. కాల్చిపడేస్తాను.. యూనిఫాం ఇక్కడ అని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తర్వాత పులివెందుల వైసీపీ ఆఫీసులోనికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లారు. అవినాష్ రెడ్డితో సమావేశం అయ్యారు. పోలింగ్ ముగిసే వరకూ బయటకు రావొద్దని ఆయనపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

పులివెందులలో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా చూసుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దగ్గర కొంత మంది దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అన్ని పార్టీల ప్రముఖ నేతల్ని పోలింగ్ కు ముందు హౌస్ అరెస్టు చేశారు. వారు పోలింగ్ కేంద్రాల వద్ద తిరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరు తిరగడం ఆపేస్తే చాలా వరకూ ఘర్షణలు తగ్గుతాయని అనుకున్నారు. అయితే అవినాష్ రెడ్డి మధ్యాహ్నమే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావడంతో .. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు పులివెందుల వైసీపీ ఆఫీసుకు రావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.  

ఉదయం నుంచి పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. దొంగ ఓటర్లు వచ్చారని .. ఇతర ప్రాంతాల వారితో ఓట్లేయించారని ఆరోపించారు. అయితే పులివెందులలో  ఏర్పాటు చేసిన పదిహేను పోలింగ్‌ బూత్‌లలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు ఎవర్నీ బయటకు లాగేయలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రతి పోలింగ్ బూత్‌లో .. సీసీ కెమెరాలు పెట్టారు. వెబ్ కాస్టింగ్ చేశారు.                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Embed widget