అన్వేషించండి

Pulivendula ZPTC ByElection: పులివెందులలో పలుచోట్ల ఉద్రిక్తత.. 100 కోట్లు పెట్టారని బీటెక్ రవి ఆరోపణలు, పత్తి యాపారం ఆపాలన్న వైసీపీ

పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వైసీపీ, కూటమి శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ZPTC ByElection in Pulivendula and Vontimitta | పులివెందుల: ఊహించినట్లుగానే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలుచోట్ల పోలింగ్ బూత్‌ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. కానేపల్లెలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడికి దిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు ధ్వంసం అయినట్లు సమాచారం. పులివెందుల మండలం ఎర్రబలె గ్రామంలోనూ ఇరు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చింతరాజు పల్లెలో ఎలక్షన్ బూత్‌లో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి కడపకు తరలించారు.

రూ.100 కోట్లు ఖర్చు, ఓటర్లను ప్రలోభాలు..
 పులివెందులలో జడ్పిటిసి సీటు కోసం వైసిపి నేతలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా రాత్రి 12 గంటల వరకు చీరలు, ముక్కుపుడకలు పంచుతూనే ఉన్నారని ఆరోపించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ సిబ్బంది సహకరించాలని, లేకపోతే తరువాత అధికారంలోకి వచ్చాక మీ మీద చర్యలు తీసుకుంటాం అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు.

దాదాపు 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటూ పులివెందుల నియోజకవర్గంలో 11 నామినేషన్లు వేశారు. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా జరగకుండా వైసీపీ నేతలు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించి ఎన్నికల అధికారులు తక్షం వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని’ బీటెక్ రవి కోరారు. 

పులివెందుల్లో పత్తి యాపారం..
ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరగడం లేదు. ప్రవీణ్ పత్తి యాపారం జరుగుతోందంటూ సెటైర్లు వేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది. ఇలా ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి పెద్దమ్మ ప్రశ్నించారు. ఈ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే పిల్లలు కాదు వాళ్లు కూడా గెలుస్తారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.


Pulivendula ZPTC ByElection: పులివెందులలో పలుచోట్ల ఉద్రిక్తత.. 100 కోట్లు పెట్టారని బీటెక్ రవి ఆరోపణలు, పత్తి యాపారం ఆపాలన్న వైసీపీ

మీ కాళ్లు పట్టుకుంటాం.. మమ్మల్ని ఓటు వేసేందుకు పంపించండి సార్ అని కొందరు ఓటర్లు పోలీసులను అడుక్కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనంపల్లి సర్పంచ్ రామామంజనేయులు ఇంటి వద్ద మంచంపై గన్ను పెట్టి పోలీసులు బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. రెండు చోట్ల బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget