India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
టీమ్ ఇండియా అండర్ 19 ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. మూడో వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 233 పరుగుల తేడాతో ఓడించారు. దాంతో ఈ వన్డే సిరీస్లో భారత్ అండర్-19 జట్టు 3-0 తేడాతో ఓడించింది. మూడో ODI మ్యాచ్లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 393 పరుగులు చేసింది. భారత్ తరపున వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ సెంచరీలు సాధించారు.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేసింది. భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ అద్భుతమైన బ్యాటింగ్తో 227 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది వైభవ్ కెరీర్లో రెండో సెంచరీ. 74 బంతులు ఆడి 127 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. అతనితో పాటు ఆరోన్ జార్జ్ 106 బంతుల్లో 118 పరుగులు చేశాడు.
భారత్ తరపున కిషన్ కుమార్ సింగ్ అత్యధిక వికెట్లు తీశాడు. కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. మహ్మద్ ఎనన్ కూడా 2 వికెట్లు తీశాడు. వైభవ్ సూర్యవంశీ కూడా బౌలింగ్లో రాణించాడు. 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
ట్రెండింగ్ వార్తలు






















