IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్ టూర్ వెళ్లడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మల్ అప్రూవల్ కోసం బిసిసిఐ వెయిట్ చేస్తోంది.

India Bangladesh Series Clearance: ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్, బంగ్లాదేశ్ టూర్ వెళ్లడానికి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఫార్మల్ అప్రూవల్ కోసం బిసిసిఐ వెయిట్ చేస్తోందని తాజాగా బోర్డు ఆఫీషియల్ తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సిరీస్ ముందుకెళ్తుందని, ప్రస్తుతం ఇండియన్ హైకమిషన్తో టాక్స్ నడుస్తున్నాయని బిసిసిఐ సోర్స్ చెప్పాడు. గవర్నమెంట్ పర్మిషన్ వస్తేనే మ్యాచ్ల కోసం స్పెషల్ విండో క్రియేట్ చేస్తామని బిసిసిఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Hopes for resolution! 🇧🇩
— Cricdope (@cricdope) August 13, 2026
Bangladesh is optimistic that the deadlock over India’s proposed tour in September will be resolved soon. Fans are eagerly awaiting a positive outcome! 🇮🇳🏏#INDvsBAN #TeamIndia #BangladeshCricket #CricketNews #Cricdope pic.twitter.com/wWFRTfXn6i
ముస్తాఫిజుర్ రెహమాన్ ఇష్యూ.. రెండు దేశాల మధ్య క్రికెట్ వివాదం
ఈ ఇయర్ ఆరంభంలో ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య బిగ్ డిస్ప్యూట్ నడిచింది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరిగిన టైమ్ లో 2026 ఐపీఎల్ ఆక్షన్ లో కేకేఆర్ 9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయాలని బిసిసిఐ ఆదేశించింది. ఈ డెసిషన్ తో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) తీవ్రంగా రియాక్ట్ అయింది. సెక్యూరిటీ ఇష్యూస్ సాకుగా చూపిస్తూ 2026 టి20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి తమ టీమ్ ని పంపకూడదని బిసిబి డిసైడ్ అయింది. తమ మ్యాచులను ఇండియా బయటకు మార్చాలని ఐసీసీని కోరినా ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ అయింది.
🚨 India–Bangladesh series reportedly cancelled! 🇮🇳🇧🇩
— Cricket 360 (@RealCrickets360) August 12, 2026
The proposed September Bangladesh tour of India has reportedly been called off after the Indian government did not grant clearance, citing security concerns for the Indian cricket team in Bangladesh.#INDvsBAN… pic.twitter.com/zX2l3eX8u0
సంబంధాలు నార్మల్ కి రావడం.. బిసిబి ఈమెయిల్ లో స్పెషల్ రిక్వెస్ట్
ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్తో బిసిసిఐ కి రిలేషన్స్ బెటర్ అయ్యాయని బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నెలలో అప్పటి బిసిబి ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ లీడర్షిప్ లో జరిగిన మీటింగ్ లో ఇండియా టూర్ అంశాలు డిస్కస్ చేశారు. సెప్టెంబర్లో ఇండియన్ టీమ్ బంగ్లాదేశ్ టూర్ వెళ్లడం, బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్ ఇండియాకి రావడం లాంటి మ్యూచువల్ ఆఫర్ల గురించి బిసిసిఐకి ఈమెయిల్ పంపినట్లు బిసిబి తెలిపింది.
గవర్నమెంట్ క్లియరెన్స్ తో సిరీస్ విండో క్రియేషన్
కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే మ్యాచ్ షెడ్యూల్ను అనౌన్స్ చేయడానికి బిసిసిఐ ప్లాన్ చేస్తోంది. పొరుగు దేశంతో క్రికెట్ సంబంధాలను మళ్లీ పునరుద్ధరించడానికి రెండు బోర్డులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సెప్టెంబర్ లో జరగబోయే ఈ సిరీస్ పై గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















