అన్వేషించండి

ZPTC Byelections Update: పోలింగ్ తీరుపై వైసీపీ తీవ్ర ఆరోపణలు - ఓటమికి కారణాలు చెబుతున్నారా ?

Pulivendula ZPTC by elections: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీల్లో జరుగుతున్న పోలింగ్ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బయట వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తోంది.

Pulivendula ZPTC by elections:  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలు తీసుకున్న  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య జరుగుతోంది. పులివెందులలో ఉన్న పదిహేను పోలింగ్ బూత్‌లు అత్యంత సమస్యాత్మకం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కారణంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొంత మంది తమను ఓట్లు వేయనివ్వడం లేదని ఆరోపించారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. పలు బూత్‌లలో ఓటర్లు ఉదయమే వచ్చి బారులు తీరారు. మద్యాహ్నానికి యాభై శాతం వరకూ పోలింగ్ జరిగింది. సాయంత్రానికి ఎనభై నుంచి 90 శాతం వరకూ పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు 

ప్రధాన పార్టీల కీలక నేతలెవరూ పోలింగ్ స్టేషన్ల వద్దకు పోకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఒంటి మిట్టలోనూ పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నానికి యాభై శాతం వరకూ పోలింగ్ నమోదు అయింది.  పులివెందులలతో పోలిస్తే ఒంటిమిట్టలో రెట్టింపు ఓటర్లు ఉన్నారు. పాతిక వేల మంది వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అక్కడ కూడా ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ చేస్తున్నారని రెండు వైపులా ఆరోపించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. 

అయితే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలింగ్ నిర్వహణపై అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. తమ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఓ సారి, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకు వచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పట్టణాల్లో దొంగ ఓటర్లను గుర్తు పట్టడం కష్టం కానీ.. పల్లెల్లో అయితే దొంగ ఓటర్లు ఎవరో.. తమ ఊరివాళ్లు ఎవరో ఏజెంట్లు సులువుగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఉన్నారు. స్థానికేతరులు ఆయా గ్రామాల్లోకి వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు ఓటమి భయంతోనే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా పులివెందుల,  ఒంటిమిట్టల్లోనే పోలింగ్ ను పర్యవేక్షిస్తూ ఉన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ మధ్యాహ్నం సమయంలో.. పులివెందులలో వైసీపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఆయన అవినాష్ రెడ్డితో మాట్లాడారు. పులివెందులలో పోలింగ్ విషయంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా , అనుచరులను అదుపులోకి ఉంచాలని కోయ ప్రవీణ్..  అవినాష్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది. 

మరో వైపు పోలింగ్ లో అక్రమాలు అంటూ.. విజయవాడలోని ఎస్‌ఈసీ ఆఫీసు ఎదుట వైసీపీ నాయకులు ధర్నా చేశారు.  ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ చూడలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget