అన్వేషించండి

Satyavedu Constituency: సత్యవేడును సాధించేది ఎవరు ? ఇటు జంపింగ్, అటు రెబల్ - వైసీపీ కొత్త ప్రయోగం

Satyavedu AP Elections 2024: ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో ఎవరు నెగ్గనున్నారు అని ఓటర్లు సైతం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Satyavedu Assembly constituency: సత్యనేడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, పిచ్చాటూరు, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, కేవీబీ పురం మండలాలు ఉన్నాయి.
2014లో టీడీపీది విజయం, 2019లో వైసీపీ సక్సెస్
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ పార్టీ నుంచి కొనేటి ఆదిమూలంను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.

కొందరు అటు, మరికొందరు ఇటు...
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని స్థానికంగా వినిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా తాము పార్టీని నమ్ముకుని అనేక ఇబ్బందులు పడ్డామని... వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం టీడీపీ నాయకులు, కార్యకర్తల పై కేసులు ఉంటూ ప్రతి గ్రామంలోని వారిపై ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని... వైసీపీ నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ లో చేరారరన్నారు. నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఎలా పని చేస్తామని పార్టీ క్యాడర్ అంటోంది.  మరోవైపు కొందరు టీడీపీ నాయకులు ఆదిమూలంకు మద్దతుగా నిలుస్తున్నారు.

రెబల్ అభ్యర్థిగా జేడీ రాజశేఖర్
టీడీపీ పార్టీకి మొదట్నుంచీ నుంచి పని చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేత జేడీ రాజశేఖర్ ఈసారి రెబల్ గా మరారు. వైసీపీ పార్టీ ఇబ్బందులు పెట్టిన టీడీపీ పార్టీ తో ఉన్న తనకు కాదని తమపై కేసులు పెట్టిన వ్యక్తికి సీటు ఇవ్వడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నియోజకవర్గంలో జేడీ రాజశేఖర్ ప్రచారం సైతం చేస్తున్నారు. ఆయన వెనకంటీ ఉన్న నాయకులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరో వైపు మాజీ ఎమ్మెల్యే హేమలత తన కుమార్తె హెలెన్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హెలెన్ ను గత రెండేళ్లు క్రితం టీడీపీ పార్టీ ఇన్చార్జి గా ప్రకటించింది. ఆమె సైతం నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఎన్ఆర్ఐ రాజేష్ పేరు తెర పైకి వచ్చింది. నియోజకవర్గంలో ఆర్ధిక, సామాజిక వర్గం బలం ఉందని.. ఆయన సైతం పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ పార్టీ కొనేటి ఆదిమూలంకు సీటు అని ప్రకటించినా.. ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. పార్టీ అధిష్టానం సైతం నాయకులతో మాట్లాడలేదు. దీంతో ఏం జరుగుతుందో అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

వైసీపీ ముందడుగు...? 
సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కి వెళ్ళడంతో ఆ స్దానాన్ని కొత్త వ్యక్తికి వైసీపీ కేటాయించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థికి సన్నిహితంగా ఉండే నూకతోటి రాజేష్ పేరు ప్రకటించింది. ఈయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండగా అనూహ్యంగా ఆయన పేరు రావడం వైసీపీ నాయకులలో సైతం కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైసీపీ నాయకుల మధ్య సఖ్యత కుదిరింది. జిల్లాకు చెందిన వైసీపీ పెద్ద నాయకులతో కలిసి ప్రచారం సైతం ప్రారంభించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget