అన్వేషించండి

AP Crime: ఏపీలో ఘోరం.. చాక్లెట్‌ ఇప్పిస్తానని ఆశచూపి.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి..!

చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని ఆశచూపి ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని ఆశచూపి ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కొండపల్లిలోని శాంతినగర్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో నివాసముండే ఆరేళ్ల బాలుడు ఆదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. బాలుడికి చాక్లెట్ కొనుక్కొనేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. నమ్మిన బాలుడు ఆ వ్యక్తితో కలిసి వెళ్లాడు. పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు.. ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాలుడికి గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
Also Read: Gold Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి పయనం.. బులియన్ మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఇవే..

మాజీ మంత్రి దేవినేని పరామర్శ
అఘాయిత్యానికి గురైన బాలుడిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
చాక్లెట్లు కొనుక్కోవడానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఖమ్మం మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్‌ (20) అలియాస్‌ చింటూ అనే వ్యక్తి నాలుగేళ్ల పసిపాపపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2020 నవంబర్ 19న చాక్లెట్లు కొనుకున్నేందుకు వచ్చిన బాలికపై (4) అత్యాచారం చేశాడు.

ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చింటూపై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి 20 ఏళ్ల జైళ్ల శిక్షను ఖరారు చేస్తూ.. తీర్పు వెలువరించారు.

Also Read: Weather Updates: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Also Read: YSR Housing Scheme: అక్టోబర్ నుంచి జగనన్న కాలనీలు.. పేదలందరికీ ఇళ్ల పథకంపై సీఎం జగన్ రివ్యూ... టిడ్కో ఇళ్లపైనా కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget