అన్వేషించండి

Chandrababu: నంద్యాల జిల్లాలో విషాదంపై చలించిపోయిన సీఎం చంద్రబాబు, బాలికకు రూ.10 లక్షలు సాయం

Andhra Pradesh News | నంద్యాల జిల్లా చాగలమర్రిలో అర్ధరాత్రి మిద్దె కూలి ఓ కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బాలిక పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు.

AP Cm Chandrababu responds over Chagalamarri incident in Nandyal District | అమరావతి: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి ఓ కుటుంబంలో న‌లుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్ధరాత్రి మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు చనిపోవడంపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అంతా నిద్రిస్తున్న సమయంలో  కుటుంబంపై అర్ధరాత్రి మట్టి మిద్దె కూలింది. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ తో పాటు ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందారు.

బాలికకు రూ.10 లక్షల సాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయి మట్టి మిద్దె కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న గురుశేఖర్ తో పాటు అతడి భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు గురులక్ష్మి, పవిత్ర సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రస్తుతం ప్రొద్దుటూరులో పదో తరగతి చదువుకుంటోంది. అయితే రాత్రికి రాత్రి తల్లిదండ్రులు సహా తోబుట్టువులు మొత్తం నలుగురు చనిపోవడంతో ప్రసన్న అనాథగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాచారం తెలుసుకుని, బాధిత బాలిక ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. 

ప్రసన్న నానమ్మకు సైతం సాయం 
ఆ బాలిక ప్రస్తుతం తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ సంరక్షణలో ఉంది. ఈ విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దాంతో విద్యార్థిని ప్రసన్న పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధురాలు నాగమ్మకు సైతం రూ.2 లక్ష సాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను అదేశించారు. జిల్లా అధికారులు కుటుంబాన్ని కోల్పోయిన బాలిక ప్రసన్నను కలిసి ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. ఇంటి మిద్దె కూలి తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన ప్రసన్నకు అండగా నిలవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా సైతం ప్రసన్నకు అండగా నిలుస్తామని అన్నారు. బాలిక సంరక్షణ, ఉన్నత చదువుల విషయంలో టీడీపీ కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Also Read: ఏపీలో అమల్లోకి రెడ్ బుక్ రాజ్యాంగం! వైసీపీ కార్యకర్తలను కలిసిన తరువాత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget