అన్వేషించండి

YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Tirumala Laddu News : బీజేపీ కేంద్ర నేతలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు హిందువులకు నిజంగా రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాలన్నారు.

Jagan made harsh comments on BJP central leaders : భారతీయ జనతా పార్టీ నేతలకు సగం తెలుసు.. సగం తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ అంశంపై ఆయన తాడేపల్లిలో మాట్లాడారు . ఈ సందర్భంగా  బీజేపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు కూడా ఉన్నారన్నారు. బీజేపీ సీనియర్ నేతలు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డులో నియమించామని వారికి ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పాలన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలని.. ఈ విషయం తెలుసుకుని.. బీజేపీ నేతలు నిజంగా హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబుపై అక్షింతలు వేయాలన్నారు. తప్పు చంద్రబాబునాయుడుదేనని.. నిజంగానే సిన్సియర్ గా మనుషులు అయితే చంద్రబాబును  తిట్టాలన్నారు. ఇలా చేయడం ధర్మమేనా చంద్రబాబు అని  గట్టిగా కడిగేయాలన్నారు. నిజంగా వాళ్లలో సిన్సియారిటీీ ఉన్న మనుషులయితే ఇలా చేస్తారన్నారు.                     

వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?

తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక నేత శోభా కరంద్లాజే అసలు టీటీడీ భవనాల్లో శ్రీవారి ఫోటోలు కూడా లేకుండా చేయాలని చూశారని ఆరోపంచారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలోనూ.. జగన్ తీరుపై హిందూ వాదుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. 

బీజేపీ రాష్ట్ర నేతలు కాకుండా.. కేంద్ర నేతల్ని.. వారి సిఫారసు మేరకు తాను టీటీడీ బోర్డు సభ్యత్వాలు ఇచ్చానని చెప్పి వారిని నియమించినందుకు జగన్ .. ఇప్పుడు ఆయన నేతల్ని సిన్సియారిటీ లేని మనుషులుగా చెప్పడం బీజేపీ నేతల్లోనూ ఆశ్చర్యకరం వ్యక్తమవుతోంది. చంద్రబాబును తిట్టాలని..లేకపోతే సిన్సియారిటీ లేని మనుషులన్నట్లుగా వ్యాక్యానించడం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. హిందువులకు ప్రతినిధులు బీజేపీ నేతలన్నట్లుగా కూడా మాట్లాడారు . జగన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో.. సరిగ్గా  తన భావనను ఎక్స్ ప్రె్స చేయలేకపోయారో కానీ.. బీజేపీ నేతల్ని కించపరిచినట్లుగా ఉండంటో.. జగన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం

బీజేపీ నేతల్ని జగన్ బహిరంగంగా విమర్శించడం  లేదు. కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఉన్నందున ఆ పార్టీతో ఎలాంటి వివాదాలను ఆయన కోరుకోవడం లేదు. కానీ ఈ తిరుపతి లడ్డూ విషయంలో  ల్యాబ్ రిపోర్టులు బయట  పెట్టినప్పటికీ.. చంద్రబాబునే తిట్టాలని..తాను చెప్పిందే నమ్మాలని ఆయన వ్యాఖ్యానించడం.. బీజేపీ కేంద్ర పెద్లదల్ని కూడా సిన్సియర్ మనుషులు కాదన్నట్లుగా మాట్లాడటం.. హాట్ టాపిక్ గా మారుతోంది.            

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget