అన్వేషించండి

Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?

Srivari Laddu : శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిపై అంశం వైఎస్ఆర్‌సీపీకి పెనుసమస్యగా మారుతోంది. ల్యాబ్ రిపోర్టులు బయటకు రావడంతో సమర్థించకోవడం కష్టంగా మారుతోంది.

Ghee used for making Srivari Laddu is becoming a major issue for YSRCP : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు దేవదేవుడు శ్రీనివాసుడు. ఆయనను ఒక్క క్షణం దర్శనం చేసుకుని ఒక్క ముక్క లడ్డూ  ప్రసాదాన్ని నోట్లో వేసుకునే భాగ్యం కోసం ఖండాంతరాలు దాటి వస్తారు. కొండపై  ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. అలాంటి చోట యంత్రాంగం  భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ప్రసాదం తయారీ కోసం వాడిన నెయ్యి విషయంలో బయటకు వచ్చిన సంచలన నిజాలు హిందూ సమాజన్ని నివ్వెర పరుస్తున్నాయి. ఇప్పుడీ నిందలన్నీ వైసీపీ మీదనే పడుతున్నాయి. సమర్థించుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. 

చంద్రబాబు ఆరోపణలతో కలకలం 

పాలన ప్రారంభించి వంద రోజులు అయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  చంద్రబాబు వైసీపీ పాలనలో జరిగిన దురాణాలను సరి చేస్తున్నామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో తిరుమలలో జరిగిన ఘోరాన్ని బయట పెట్టారు. లడ్డూ ప్రసాదంలో  జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారన్నారు. చంద్రబాబు బయట పెట్టిన మాటలు సంచలనం సృష్టించాయి. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో.. దుమారం రేగింది. వైసీపీ నేతలు అప్పటికప్పుడు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ఘోరం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆధారాలు  బయట పెట్టాలని సవాల్ చేశారు. 

తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు

ఆధారాలు  బయట పెట్టడంతో వైసీపీకి గడ్డు పరిస్థితి

దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ సవాల్  చేశారు. ఆ తర్వాత కాసేపటికే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రె్స మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్టులు విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరుమలలో లడ్డూ ప్రసాదం, అన్న  ప్రసాదంలో క్వాలిటీ ఎందుకు  తగ్గిపోయిందో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు నిపుణులతో కమిటీని నియమించారు. ఆ తర్వాత ఈవో శ్యామలరావు.. సరఫరా చేస్తున్న  పదార్థాలన్నింటినీ దేశంలో పేరెన్నికగన్న ల్యాబుల్లో టెస్టులకు పంపించారు. నెయ్యి విషయంలో వచ్చిన  రిపోర్టును చూసిన వెంటనే.. మొత్తం ఆ నెయ్యి వాడకాన్ని నిలిపివేసి.. ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్టు విషయంలో వైసీపీ ఎదురుదాడికి దిగడం తప్ప మరో మార్గం లేదు. 

నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?

విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకున్న అల్ఫా కంపెనీ

నిజానికి ఈ వ్యవహారంలో మొత్తం ఏం జరిగిందో ఆధారాలతో సహా సేకరించిన తరవాతనే చంద్రబాబు బయట పెట్టారని తెలుస్తోంది. ఈ విషయంలో నెయ్యి కాంట్రాక్ట్ పొందిన సంస్థల్లో ఒకటైన అల్ఫా కంపెనీ.. విదేశాల నుంచి  బటర ఆయిల్ ను దిగుమతి చేసుకుంది. నెయ్యిలో కల్తీ చేసి టీటీడీకి సరఫరా  చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు టీటీడీ వద్ద ఉన్నాయి. ఈ మొత్తం  వ్యవహారంలో విచారణ జరిపించి అందరిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. 

వైసీపీపై ఇప్పటికే అన్యమత ముద్ర - ఇక హిందువులూ దూరమే ! 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రిస్టియానిటీని పాటిస్తుంది. వారింట్లో అందరూ క్రిస్టియన్లే. జగన్ కూడా ఎన్నికల్లో గెలవగానే జెరూసలేం వెళ్లి వచ్చారు. ఎలా చూసినా ఆయన అన్యమతస్తుడని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. హిందూ దేవుళ్ల ప్రసాదాలను క్రిస్టియన్లు తినరు. సీఎంగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆయన ప్రసాదం తినడం ఎప్పుడూ చూడలేదని  టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ హయాంలో .. ప్రపంచంలోనే హిందువులకు దేవదేవుడైన శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం ఆ పార్టీకి పెను శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget