అన్వేషించండి

Kuppam Babu : ప్రశాంతమైన కుప్పంలో రౌడీ రాజ్యం .. ఓటుతో బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపు !

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పంలో రెండో రోజు పర్యటించారు. రెండో రోజు పర్యటనలోనూ ఉద్రిక్తత ఏర్పడింది.


కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు దృష్టి పెట్టారు. రెండో రోజు పర్యటనలో తన ప్రసంగాల్లో ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలపైనే మాట్లాడారు. లక్ష్మీపురం రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు కుప్పం ప్రశాంతమైన నియోజకవర్గమని.. తనను ఏడుసార్లు గెలిపించారని గుర్తు చేసుకున్నారు. కుప్పంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్, వైసీపీ చేసింది శూన్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్ లు ఎపిలో ఉన్నాయని దోచుకోవడం, దాచుకోవడమే జగన్  రాజకీయమని విమర్శించారు. 

Also Read : షెడ్యూలే రాలేదు.. అప్పుడే అభ్యర్థుల్ని టార్గెట్ చేశారు ! నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అందరిదీ దూకుడే !

ఏపీలో ఇసుక దొరకడం లేదని.. కానీ ఏపీ ఇసుక బయట రాష్ట్రాల్లో దొరుకుతోందన్నారు. జగన్ చెత్త ముఖ్యమంత్రి కాబట్టే చెత్తపై పన్ను వేస్తున్నారని... చివరికి మరుగుదొడ్లకు కన్నేసిన ఘనుడు సిఎం అని విమర్శించారు. పన్నులు కడుతున్నాం కాబట్టి జగన్‌ను వచ్చి బాత్‌రూమ్‌లు కడగాలని డిమాండ్ చేయాలని ప్రజలకు సూచించారు. ఎపిలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితుల్లో లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెంట్ స్థలాల్లో ఎవరూ ఇళ్లు నిర్మించుకోవద్దని.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. 

Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
  
కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవరాక్షన్ చేస్తే తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.  కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా  త్రిలోక్ ను ప్రకటించారు. 25వార్డు టిడిపి అభ్యర్థిగా లోకేష్ ను ప్రకటించారు. రోజంతా బిజిబిజీగా చంద్రబాబు పర్యటిస్తున్నారు.  ఉదయమే ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.  లక్ష్మీపురం ‌వరదరాజుల ఆలయాన్ని సందర్శించారు‌. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీపురంలో రోడ్ షో నిర్వహించారు. తర్వతా రాధాక్రిష్ణ రోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేసి..ముస్లింల సమస్యలపై  నాయకులతో చర్చించారు. 

Also Read : జగన్‌ది దోపిడీ సర్కార్ - రెండున్నరేళ్ల కంటే ముందే టీడీపీ ప్రభుత్వం ! కుప్పంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !

చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం గుంజా రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు.   మండల కేంద్రమైన శాంతిపురంలోనూ టీడీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు  చేయడంతో వైసీపీ నేతలు ఎవరికీ తెలియకుండా వచ్చి అక్కడక్కడా వాటిని చించేస్తున్నారు. ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతల డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. 

Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget