అన్వేషించండి

Chandrababu Macharla: రౌడీయిజం, నేరాలు చేస్తే చెత్త లాగే చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం - మాచర్లలో చంద్రబాబు హెచ్చరిక

Macherla: మాచర్ల వైసీపీ నేతలకు చంద్రబాబు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. అరాచకాలు చేసిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Chandrababu issues direct warnings to Macherla YCP leaders: గతంలో మాచర్లలో చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని పల్నాడు గడ్డ పై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేశారు. మాచర్లలో ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు.  రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని కఠినంగా హెచ్చరించారు. మాచర్లలో గతంలో ప్రజాస్వామ్యం లేకపోవడం, అరాచకాలు జరగడం వంటి సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు వచ్చాయన్నారు.  రాయలసీమలో ముఠాలను తొలగించినట్లుగా, పల్నాడులో  రౌడీయిజం అంతు చూస్తామన్నారు.  ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని భరోసా ఇచ్చారు. 

'సూపర్ సిక్స్' పథకాల అమలు చేస్తున్నామని  ఒకేసారి రూ.12 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని గుర్తు చేశారు.  ఆడబిడ్డల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. "విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అందరు పిల్లలకు 'తల్లికి వందనం' అమలు చేశాం. రైతులకు 'అన్నదాత సుఖీభవ' ద్వారా ఆదుకుంటున్నాం" అని పేర్కొన్నారు. పింఛన్ల రూపంలో ఏడాదికి రూ.34 వేల కోట్లు విడుదల చేస్తున్నామని, డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మున్ముందు 10 లక్షల ఉద్యోగాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 

పేదరికం లేని సమాజ నిర్మాణమే మా ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నందున జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నిజమైన దసరా, దీపావళి వచ్చాయని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.  "చెత్త తీస్తేనే సరిపోదు.. మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి" అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వేసి, దానిపై పన్ను విధించిందని ఆరోపించారు. మేం అధికారంలోకి రాగానే పన్ను తొలగించామని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 'లెగసీ వేస్ట్' పూర్తిగా తొలగిస్తామని ప్రకటించారు. స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటికి వచ్చి, పాత వస్తువులు తీసుకుని నిత్యవసరాలు అందిస్తామని తెలిపారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, రాష్ట్రాన్ని 'ప్లాస్టిక్ ఫ్రీ'గా మార్చుతామని చెప్పారు. "చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం" అని కట్టుబాటు పని చేస్తామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు."నా లక్ష్యం ఒక్కటే.. అందరికీ ఆదాయం పెరగాలి" అని చంద్రబాబు చెప్పారు. 'వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా పనులు వెంటనే పూర్తవుతాయని, 730 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో 'సంజీవని' కార్యక్రమం ప్రవేశపెట్టి, అందరికీ రూ.2.5 లక్షల బీమా, పేదలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని ప్రకటించారు. ఇంటి వద్దే వైద్యం అందేలా చూస్తామన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్లకు సమీపంలో నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ తాగునీరు సమస్యగా ఉందని, నదుల అనుసంధానం ద్వారా అందరికీ సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది 94 శాతం ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తోందని, కేంద్రంతో మాట్లాడి 'మిర్చి బోర్డు' తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం తగ్గించాలని సూచించారు. మాచర్లకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తున్నామని, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆస్పత్రుల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. పల్నాడు ఉత్సవాలను  ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Attack on Deputy Speaker Raghurama: అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
Andhra KGF: ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Best Courses After Intermediate : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
IPL 2026 : ఆర్‌సీబీకి వరుస షాకులు: ఐపీఎల్ 2026 నుండి స్టార్ బౌలర్ అవుట్.. బౌలింగ్ కష్టాల్లో బెంగళూరు!
ఆర్‌సీబీకి వరుస షాకులు: ఐపీఎల్ 2026 నుండి స్టార్ బౌలర్ అవుట్.. బౌలింగ్ కష్టాల్లో బెంగళూరు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Embed widget