అన్వేషించండి

Chandrababu Macharla: రౌడీయిజం, నేరాలు చేస్తే చెత్త లాగే చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం - మాచర్లలో చంద్రబాబు హెచ్చరిక

Macherla: మాచర్ల వైసీపీ నేతలకు చంద్రబాబు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. అరాచకాలు చేసిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Chandrababu issues direct warnings to Macherla YCP leaders: గతంలో మాచర్లలో చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని పల్నాడు గడ్డ పై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేశారు. మాచర్లలో ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు.  రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని కఠినంగా హెచ్చరించారు. మాచర్లలో గతంలో ప్రజాస్వామ్యం లేకపోవడం, అరాచకాలు జరగడం వంటి సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు వచ్చాయన్నారు.  రాయలసీమలో ముఠాలను తొలగించినట్లుగా, పల్నాడులో  రౌడీయిజం అంతు చూస్తామన్నారు.  ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని భరోసా ఇచ్చారు. 

'సూపర్ సిక్స్' పథకాల అమలు చేస్తున్నామని  ఒకేసారి రూ.12 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని గుర్తు చేశారు.  ఆడబిడ్డల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. "విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అందరు పిల్లలకు 'తల్లికి వందనం' అమలు చేశాం. రైతులకు 'అన్నదాత సుఖీభవ' ద్వారా ఆదుకుంటున్నాం" అని పేర్కొన్నారు. పింఛన్ల రూపంలో ఏడాదికి రూ.34 వేల కోట్లు విడుదల చేస్తున్నామని, డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మున్ముందు 10 లక్షల ఉద్యోగాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 

పేదరికం లేని సమాజ నిర్మాణమే మా ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నందున జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నిజమైన దసరా, దీపావళి వచ్చాయని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.  "చెత్త తీస్తేనే సరిపోదు.. మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి" అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వేసి, దానిపై పన్ను విధించిందని ఆరోపించారు. మేం అధికారంలోకి రాగానే పన్ను తొలగించామని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 'లెగసీ వేస్ట్' పూర్తిగా తొలగిస్తామని ప్రకటించారు. స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటికి వచ్చి, పాత వస్తువులు తీసుకుని నిత్యవసరాలు అందిస్తామని తెలిపారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, రాష్ట్రాన్ని 'ప్లాస్టిక్ ఫ్రీ'గా మార్చుతామని చెప్పారు. "చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం" అని కట్టుబాటు పని చేస్తామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు."నా లక్ష్యం ఒక్కటే.. అందరికీ ఆదాయం పెరగాలి" అని చంద్రబాబు చెప్పారు. 'వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా పనులు వెంటనే పూర్తవుతాయని, 730 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో 'సంజీవని' కార్యక్రమం ప్రవేశపెట్టి, అందరికీ రూ.2.5 లక్షల బీమా, పేదలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని ప్రకటించారు. ఇంటి వద్దే వైద్యం అందేలా చూస్తామన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్లకు సమీపంలో నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ తాగునీరు సమస్యగా ఉందని, నదుల అనుసంధానం ద్వారా అందరికీ సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది 94 శాతం ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తోందని, కేంద్రంతో మాట్లాడి 'మిర్చి బోర్డు' తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం తగ్గించాలని సూచించారు. మాచర్లకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తున్నామని, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆస్పత్రుల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. పల్నాడు ఉత్సవాలను  ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget