AP onion farmers: ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
Good news farmers: ఏపీ ఉల్లి రైతులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పంట పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు రూ.50వేలు చెల్లించాలని నిర్ణయించింది.

AP onion farmers Get Rs 50 thousand assistance per hectare: ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు రూ.50వేలు చెల్లించనున్నారు. పంటను ఎంతకు అమ్ముకున్నారు ... ఎవరికి అమ్ముకున్నారు అనే దానితో సంబంధం లేకుండా..ఉల్లి సాగు చేసిన రైతులందరికీ ఈ సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.రాష్ట్రంలో కుర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా ఉల్లి సాగు జరిగింది. రైతులు హెక్టార్కు ₹85,000 నుంచి ₹1.23 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధరలు రాలేదు. ఇది రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. అందుకే రూ. 100కోట్లు వెచ్చించి రైతులకు సాయం చేయాలని నిర్ణయించారు.





















