అన్వేషించండి

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం

C RamChandraiah Elected As MLC | ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సి. రామచంద్రయ్య, జనసేన నేత పి హరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

New MLCs in Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కూటమి అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ నేత ఏపీ ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, జనసేన నేత పి. హరి ప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఈ ఇద్దరే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి నాలుగు రోజుల కిందట అభ్యర్థుల్ని ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు, జనసేన నుంచి పి హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ అని తెలిసిందే. జులై 2న సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్‌లు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.

నేటితో ముగిసిన నామినేషన్ల ఉపంసహరణ 
రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (CEC) జూన్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో జూన్ 25న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. జులై 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉండగా, అదే రోజు కూటమి తరఫున టీడీపీ నేత రామచంద్రయ్య, జనసేన నేత హరి ప్రసాద్‌లు నామినేషన్ వేశారు.  జులై 3న ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించారు. జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. అయితే కేవలం ఇద్దరు అభ్యర్థులే పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఒకవేళ మరిన్ని నామినేషన్లు వచ్చింటే, ఎన్నికల అధికారులు ఈ 12న ఎన్నికల నిర్వహించి, ఫలితాలను ప్రకటించాల్సి వచ్చేది.  

టీడీపీలో చేరిన ఇక్బాల్, రామచంద్రయ్య               
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య, ఇక్బాల్ టీడీపీలో చేరడం తెలిసిందే. ఫిరాయింపు నేతలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ రామచంద్రయ్యపై, మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పై అనర్హత వేటు వేశారు. దాంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. కూటమికి భారీగా ఎమ్మెల్యే సీట్లు ఉండటం, మరోవైపు వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాల్సిన కోటా ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో వాళ్లు నామినేషన్ వేయలేదు. దాంతో అనుకున్నట్లుగానే రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని కూటమి నేతలు దక్కించుకున్నారు.   

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడుLSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
AP SSC Results 2025 on Whatsapp : వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Embed widget