ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
ఇటీవల చంద్రబాబు సంతకాలు చేసిన 5 ఫైళ్లతో పాటు పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
మెగా డీఎస్సీతో 16 వేల 347 టీచర్ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం రద్దు చేసే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది
సామాజిక భద్రత పింఛన్ రూ.3000 నుంచి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం. దివ్యాంగులకు పెన్షన్ పెంపు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ సెన్సెస్ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది
ఏపీ వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్ లను పున: ప్రారంభించేందుకు చర్యలు విజయవాడలోని YSR హెల్త్ వర్సిటీ పేరును NTR హెల్త్ యూనివర్సీటీగా పునర్ నామకరణం
ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమాకానికి కేబినెట్ ఆమోదం
మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
గత ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదలకు నిర్ణయం
అధ్వాన్నంగా మారిన రోడ్లపై వెంటనే గుంతలు పూడ్చాలని చర్యలకు ఆదేశాలు
జూన్ 28 నుంచి జులై 18 వరకు 2, 3 రోజులకోసారి శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం
Thanks for Reading.
UP NEXT
ప్యాలెస్ల మాదిరిగా జిల్లాల్లోనూ వైసీపీ భవనాలు! వాటి ఖర్చెంత?
View next story