అన్వేషించండి

Dharmana Prasadarao : రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు, శాసన వ్యవస్థలో కోర్టుల జోక్యం సరికాదు : ధర్మాన

Dharmana Prasadarao : ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీం చెప్పిందన్నారు.

Dharmana Prasadarao On Three Capitals : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో మూడు రాజధానుల అంశం(Three Capitals Issue)పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు(Dharmana Prasadarao) న్యాయవ్యవస్థను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పులు బాధ కల్గించాయన్నారు. ఒకరి విధి నిర్వహణలో మరొకరి జోక్యం సరికాదన్నారు. ఏ వ్యవస్థ రాజ్యాంగ బాధ్యతలు నెరవేర్చకుండా మరో వ్యవస్థకు అడ్డుపడకూడదన్నారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలన్నారు. రాజ్యాంగం తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు పాలన చేయాలని రాజ్యాంగమే చెప్పిందన్నారు. రాజ్యాంగానికి(Constitution) ఎవరూ అతీతుల కారన్న ధర్మాన కార్యనిర్వాహక వ్యవస్థలో కోర్టులు జోక్యం సరికాదన్నారు. ఏపీ అసెంబ్లీకి పరిమితులను పెడుతూ హైకోర్టు తీర్పులు ఇచ్చిందన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయకుడదంటూ హైకోర్టు తెలిపిందన్నారు. హైకోర్టు తీర్పు(High Court Verdict) తర్వాత స్పీకర్ కు లేఖ రాశానన్న ధర్మాన, న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చించానన్నారు. కోర్టులంటే అందరికి గౌరవం ఉందన్నారు. కోర్టు తీర్పులపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Also Read : Atchannaidu: జేబులోకి 10 వేల కోట్ల కోసమే లిక్కర్ పాలసీ మార్పు, జగన్ కుట్ర ఇదీ: అచ్చెన్నాయుడు

న్యాయవ్యవస్థకు స్వీయ నియంత్రణ ఉండాలి

జ్యుడీషియల్‌ యాక్టివిజం(Judicial Acitivism) పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందన్నారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే ఆ విషయం ప్రజలు చూసుకుంటారని, అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధిపై కోర్టులో చెప్పాలన్నారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని ధర్మాన అన్నారు. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు ఉంటాయన్న ఆయన... న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులపైనే ఉందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అధికారాల విషయంలో కోర్టులు పరిధిని సుప్రీం తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. రాజ్యంగంలోని వ్యవస్థల పరిధి, విధులపై స్పష్టత రావాలన్నారు. ఈ స్పష్టత లేకే వ్యవస్థలలో గందరగోళం నెలకొందన్నారు. 

Also Read : AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి

టాప్ హెడ్ లైన్స్

Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget