అన్వేషించండి

Dharmana Prasadarao : రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు, శాసన వ్యవస్థలో కోర్టుల జోక్యం సరికాదు : ధర్మాన

Dharmana Prasadarao : ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీం చెప్పిందన్నారు.

Dharmana Prasadarao On Three Capitals : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో మూడు రాజధానుల అంశం(Three Capitals Issue)పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు(Dharmana Prasadarao) న్యాయవ్యవస్థను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పులు బాధ కల్గించాయన్నారు. ఒకరి విధి నిర్వహణలో మరొకరి జోక్యం సరికాదన్నారు. ఏ వ్యవస్థ రాజ్యాంగ బాధ్యతలు నెరవేర్చకుండా మరో వ్యవస్థకు అడ్డుపడకూడదన్నారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలన్నారు. రాజ్యాంగం తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు పాలన చేయాలని రాజ్యాంగమే చెప్పిందన్నారు. రాజ్యాంగానికి(Constitution) ఎవరూ అతీతుల కారన్న ధర్మాన కార్యనిర్వాహక వ్యవస్థలో కోర్టులు జోక్యం సరికాదన్నారు. ఏపీ అసెంబ్లీకి పరిమితులను పెడుతూ హైకోర్టు తీర్పులు ఇచ్చిందన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయకుడదంటూ హైకోర్టు తెలిపిందన్నారు. హైకోర్టు తీర్పు(High Court Verdict) తర్వాత స్పీకర్ కు లేఖ రాశానన్న ధర్మాన, న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చించానన్నారు. కోర్టులంటే అందరికి గౌరవం ఉందన్నారు. కోర్టు తీర్పులపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Also Read : Atchannaidu: జేబులోకి 10 వేల కోట్ల కోసమే లిక్కర్ పాలసీ మార్పు, జగన్ కుట్ర ఇదీ: అచ్చెన్నాయుడు

న్యాయవ్యవస్థకు స్వీయ నియంత్రణ ఉండాలి

జ్యుడీషియల్‌ యాక్టివిజం(Judicial Acitivism) పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందన్నారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే ఆ విషయం ప్రజలు చూసుకుంటారని, అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధిపై కోర్టులో చెప్పాలన్నారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని ధర్మాన అన్నారు. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు ఉంటాయన్న ఆయన... న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులపైనే ఉందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అధికారాల విషయంలో కోర్టులు పరిధిని సుప్రీం తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. రాజ్యంగంలోని వ్యవస్థల పరిధి, విధులపై స్పష్టత రావాలన్నారు. ఈ స్పష్టత లేకే వ్యవస్థలలో గందరగోళం నెలకొందన్నారు. 

Also Read : AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget