అన్వేషించండి

AP High Court: రాజధానిపై కాదు ప్రభుత్వ నిర్ణయ చట్టబద్దతపై విచారణ ... హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

అమరావతి వ్యాజ్యాలపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో విచారణ జరపడంలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల చట్టబద్దతపై విచారణ చేస్తున్నామని కోర్టు తెలిపింది.

ఏపీ రాజధాని అంశంపై విచారణ చేస్తున్న హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల చట్టబద్ధతపై విచారణ చేస్తున్నామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ఏపీ రాజధాని వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు హైకోర్టు విచారణ చేసింది. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్‌లు రైతుల తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేకించలేదని తెలిపారు. 

Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !

ప్రతిపక్ష నేతగా అమరావతికి ఓకే

సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అవసరమైతే ఆ వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నింటికి అనుకూలమైన ప్రాంతంతో కావడంతో అమరావతిలో రాజధాని నిర్మించడానికి గత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో రాజధానిపై పలు రకాల సూచనలు చేశారని కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేయాలని కోరుకున్నారని ధర్మాసనానికి తెలియజేశారు. ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చేందుకు వీల్లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎవరూ కోర్టులో సవాలు చేయలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న వారంతా గతంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.  

Also Read: పరిషత్ ఉపఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ హవా..పుంజుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే

మూడు రాజధానులపై వ్యతిరేకత

చరిత్రలో ఒక్కచోటే రాజధాని ఉందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం 3 రాజధానులపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒకటే రాజధాని అని ఉందని తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు చదివి వినిపించారు. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ధికి విఘాతం కలిగించడమేనన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

Also Read:  బంగాళాఖాతంలో వాయుగుండం.. దంచికొడుతున్న వానలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Invest Small & Gain Big : కొత్త సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గించి ఈ పని చేయండి.. ఫ్యూచర్​లో మంచి లాభం పొందుతారు
కొత్త సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గించి ఈ పని చేయండి.. ఫ్యూచర్​లో మంచి లాభం పొందుతారు
Embed widget