అన్వేషించండి

AP Postal Ballot Voting: ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులు సస్పెండ్, ఆపై కఠిన చర్యలు: ముఖేష్ కుమార్ మీనా వార్నింగ్

Andhra Pradesh Elections 2024: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మే 8న చివరి అవకాశం ఇవ్వగా, ఎవరైనా ప్రలోభాలకు గురయితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా.

AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగవారం ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన విషయాలు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మే 3న, మరికొన్ని జిల్లాల్లో మే 4న హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ 5 వ తేదీన విజయనగరం జిల్లాల్లో తాను పర్యటించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలించినట్లు గుర్తుచేశారు.

ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారిపై, తీసుకునే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రలోభాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

కొందరు ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వంటి ప్రలోభాలకు లోనుకావడం చెడు సంకేతం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫైఐఆర్ ఫైల్  చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి, సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

పలుచోట్ల నగదు సీజ్, పలువురి అరెస్ట్ 
విశాఖపట్నం  తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారు. ఒంగోలులో యూపీఐ ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపించినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రాథమిక విచారణ జరిపించి, కాల్ డేటా, బ్యాంక్ ట్రాంగ్జాషన్ ద్వారా  దాదాపు ఎనిమిది నుండి పది మంది ఉద్యోగులను గుర్తించామన్నారు.
వీవీఐపీలు రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో వారి బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీస్ శాఖ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో సమస్యలు తతెత్తుతున్నాయి. వీరి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని సంబందిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అయితే ఎవరన్నా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే, ఈ 9న ఓటు హక్కును వినియోగించునే అవకాశం కల్పించారు. 

పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల పోలీసులు ఉన్నారు. హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ కింద 31 వేల మంది, మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీరిలో ఇప్పటి వరకూ 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోను, హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. పలు రకాల కారణాల వల్ల కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో సంబంధిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగి ఉన్నాడో ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో స్పాట్ లోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో కూడా అవకాశాన్ని కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. మే 8 వరకు వాళ్లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
YS Sharmila: అమరావతిపై తీర్మానం మంచిదే కానీ కేంద్రం ఇవ్వాల్సిన నిధుల మాటేమిటి? చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
అమరావతిపై తీర్మానం మంచిదే కానీ కేంద్రం ఇవ్వాల్సిన నిధుల మాటేమిటి? చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Nagarjuna : నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
Embed widget