అన్వేషించండి

AP Postal Ballot Voting: ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులు సస్పెండ్, ఆపై కఠిన చర్యలు: ముఖేష్ కుమార్ మీనా వార్నింగ్

Andhra Pradesh Elections 2024: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మే 8న చివరి అవకాశం ఇవ్వగా, ఎవరైనా ప్రలోభాలకు గురయితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా.

AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగవారం ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన విషయాలు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మే 3న, మరికొన్ని జిల్లాల్లో మే 4న హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ 5 వ తేదీన విజయనగరం జిల్లాల్లో తాను పర్యటించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలించినట్లు గుర్తుచేశారు.

ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారిపై, తీసుకునే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రలోభాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

కొందరు ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వంటి ప్రలోభాలకు లోనుకావడం చెడు సంకేతం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫైఐఆర్ ఫైల్  చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి, సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

పలుచోట్ల నగదు సీజ్, పలువురి అరెస్ట్ 
విశాఖపట్నం  తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారు. ఒంగోలులో యూపీఐ ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపించినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రాథమిక విచారణ జరిపించి, కాల్ డేటా, బ్యాంక్ ట్రాంగ్జాషన్ ద్వారా  దాదాపు ఎనిమిది నుండి పది మంది ఉద్యోగులను గుర్తించామన్నారు.
వీవీఐపీలు రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో వారి బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీస్ శాఖ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో సమస్యలు తతెత్తుతున్నాయి. వీరి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని సంబందిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అయితే ఎవరన్నా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే, ఈ 9న ఓటు హక్కును వినియోగించునే అవకాశం కల్పించారు. 

పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల పోలీసులు ఉన్నారు. హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ కింద 31 వేల మంది, మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీరిలో ఇప్పటి వరకూ 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోను, హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. పలు రకాల కారణాల వల్ల కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో సంబంధిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగి ఉన్నాడో ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో స్పాట్ లోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో కూడా అవకాశాన్ని కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. మే 8 వరకు వాళ్లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Embed widget