అన్వేషించండి

AP Cabinet : 46 లక్షల మంది ఇళ్ల రుణాలకు వన్ టైం సెటిల్మెంట్ ! పేదలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ..కేబినెట్ భేటీలో నిర్ణయం !

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పేదల హౌసింగ్ లోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వన్ టైం సెటిల్మెంట‌్ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన పేదల కోసం ఏపీ ప్రభుత్వం వన్ టైమ్‌ సెటిల్మెంట్ పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.   1983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలు, ఇళ్లపై  లబ్దిదారులు అత్యధిక శాతం రుణాలు తిరిగి చెల్లించడం లేదు. దీంతో ఆ ఆస్తిని లబ్దిదారులు అమ్ముకోవడానికి అవకాశం ఉండటం లేదు. ఈ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వన్ టైమ్ సెటిల్మెంట్ పథకానికి మంత్రివర్గంలో ఆమోదించారు. ఈ నిర్ణయం వల్ల  46,61,737 మంది లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.  గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చని ప్రకటించారు.Also Read : కార్పొరేషన్ రుణాల లెక్క చెప్పండి .. ఏపీ ప్రభుత్వానికి కాగ్ లేఖ !
 
ఏపీలో మొదటి సారి 1983 నుంచి ప్రభుత్వం ఇళ్లను పేదలకు నిర్మిస్తోంది. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6వేలుగా నిర్ణయించారు. అందులో సగం రాయితీగా ఇస్తే మిగిలిన రూ.3వేలు హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణం రూపంలో ఇచ్చింది. ఆ రూ. మూడు వేల లబ్దిదారులు వాయిదాల రూపంలో చెల్లించాలి అలా 2011 వరకూ ప్రభుత్వాలు పేదలకు అలా సగం తాము భరించి.. సగం పేదలు వాయిదాల రూపంలో కట్టేలా ఇళ్లు ముంజూరు చేస్తున్నాయి. అయితే పేదలు ఇళ్లు తీసుకున్నారు కానీ ఆ వాయిదాలు కట్టలేకపోయారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు.  ఇలా మొత్తం హౌసింగ్ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని ఇంకా చెల్లించని లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలుగా ఉంది. మొత్తంగా ప్రభుత్వం ఇచ్చిన రుణం రూ.8,700 కోట్లుగా ఉంది. వారు రుణాలు చెల్లించకపోవడం వల్ల ఆ ఇళ్లపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు వారికి ధఖలు పడలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టించుకుని వారికి వారి ఆస్తులను అమ్ముకునేలా హక్కులు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.Also Read : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
   
కేబినెట్‌ సమావేశంలో మరో 38 అంశాలపైనా చర్చించారు.  వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లో గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. Also Read : ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
 
పెన్షన్లను తగ్గిస్తున్న అంశంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై మంత్రులకు సీఎం జగన్ ప్రత్యేకమైన సూచనలు చేశారు. పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం ఆదేశించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలన్నారు. ధనికులను కూడా పెన్షన్ లబ్దిదారుల జాబితాలో టీడీపీ ప్రభుత్వం చేర్చిందని వారిని మాత్రమే తొలగిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అలాగే మంత్రులను  క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. 

Also Read : జగన్, విజయసాయిలకు ఊరట ... బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు !
    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget