అన్వేషించండి

TTD Board : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?

టీటీడీలో 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం వివాదాస్పదం అవుతోంది. వారు భక్తుల ప్రయోజనాలను దెబ్బతీసి శ్రీవారిని కొందరికే పరిమితం చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్‌తో కలిపి ఉన్న 25 మంది బోర్డుపైనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ పునరావాసంగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా టీటీడీ పాలక మండలిలో 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. ఈ 50 మంది పాలక మండలిలో ఏం చేస్తారు..? వారికి ఉన్న అధికారాలేమిటి..? అసలు ఎందుకు వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చాల్సి వచ్చింది ? అన్న  సందేహాలకు ఎవరి దగ్గరా సమాధానాలు ఉండవు. 

12 నుంచి 75కి చేరిన పాలకమండలి సభ్యుల సంఖ్య ! 
 
ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయానికి రోజుకు లక్ష మంది వరకూ భక్తులు వస్తూంటారు. అపర కుబేరులు కూడా శ్రీవారి దర్శనం కోసం వస్తూంటారు. టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉంటే ఆ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో  రాజకీయనేతలు, బడా పారిశ్రామికవేత్తలందరికీ తెలుసు. అందుకే  టీటీడీ బోర్డులో సభ్యులవ్వాలని తహతహలాడుతూంటారు. ప్రభుత్వాలను కాకాపట్టి సాధిస్తూ ఉంటారు. అయితే అన్ని ప్రభుత్వాలూ శ్రీవారికి.. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలకు గౌరవం ఇచ్చాయి. పదవులు ఇవ్వడానికే టీటీడీ బోర్డును భర్తీ చేసే ప్రయత్నం చేయలేదు. గతంలో 12మందితోనే పాలక మండలి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. Also Read : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..?

ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 50మందికి పాలకమండలి సభ్యుల హోదా ! 

ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలక మండలిని పాతిక మందికి చేర్చారు. ఇప్పుడు కొత్తగా యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. వీరిలో ఎవరూ హిందూత్వానికి సేవ చేసిన వారు లేరు. శ్రీవారి భక్తులకు మేలు చేయాలనో.. సేవ చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టిన వారు కూడా లేరు. ఉన్నదల్లా ప్రభుత్వం వద్ద పలుకుబడి మాత్రమే.  వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దలు, కేంద్రమంత్రులు సిఫార్సు చేసిన వారందర్నీ కాదనకుండా ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చేశారు. అయితే వారెవరికీ ప్రత్యేకమైన ఓటింగ్ హక్కులు ఉండవని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ సభ్యుల మాదిరిగానే వారికి దర్శనాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. Also Read : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !

ప్రత్యేక ఆహ్వానితులు భక్తుల ప్రయోజనాలను కాపాడతారా..? దెబ్బతీస్తారా ? 

టీటీడీ పాలక మండలి సభ్యుడికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. వాటిలో ఒకటి ప్రతీ రోజూ రెండు వందల టిక్కెట్లను కేటాయించడం. ఇది అధికారికమో..అనధికారికమో స్పష్టత లేదు కానీ సంప్రదాయంగా వస్తోంది. అలాగే సభ్యులకు ఎప్పుడు సమావేశాలకు వచ్చినా .. దర్శనం కోసం వచ్చినా టీటీడీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనాలు ఏర్పాటు చేయడం .. బస దగ్గర్నుంచి వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తారు. దాని వల్ల భక్తుల సొమ్ము చాలా వరకూ వారికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.  గతంలో  సభ్యులు కొంత మంది ఉన్నప్పుడే పాలక మండలి సభ్యుల పేర్లతో లెటర్ ప్యాడ్లు దుర్వినియోగం అయ్యేవి. తీవ్రమైన ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు వారి సంఖ్య విపరీతంగా ఉంది. పైగా రాజకీయ అవసరాల కోసం నియమితులైన వారు ఎక్కువగా ఉన్నారు. వారి వల్ల టీటీడీ బోర్డుకు కానీ.. భక్తులకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ భక్తుల డబ్బులు మాత్రం వారి కోసం వెచ్చించాల్సి రావడం మాత్రం తప్పనిసరి. Also Read : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !

శ్రీవారిని భక్తులకు దూరం చేస్తే ప్రభుత్వానికే ఇబ్బంది ! 

పాలకమండలి సభ్యుల వల్ల భక్తులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు ఉన్న 75 మంది సభ్యులకు రోజుకు రెండువందల టిక్కెట్లు కేటాయిస్తే ఇక సామాన్యులకు దక్కే దర్శనాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. వారందరూ తమ పలుకుబడిని ఉపయోగించుకుని ఆర్జిత సేవల టిక్కెట్లను కూడా పొందితే ఇక అలాంటి సేవలు సామాన్య భక్తులకు దక్కడం దుర్లభమే అవుతుంది. ఈ జంబో టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బయటపడతాయి. భక్తులను ఇబ్బంది పెడితే అది ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. 

Also Read : మానవ మృగం చచ్చిందంటూ కేటీఆర్ రియాక్షన్..

టాప్ హెడ్ లైన్స్

AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget