అన్వేషించండి

AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మత్స్యకార భరోసా పథకం కింద 20 వేల రూపాయలు అందజేస్తుంది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మత్స్యకార భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • మే 15 లేదా 16న లబ్ధిదారుల ఖాతాల్లో ₹20,000 జమ అవుతుంది.
  • కొత్త నిబంధనలు, రూల్స్ సవరించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది.
  • gswsnbm.ap.gov.in పోర్టల్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

AP Matsyakara Bharosa 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాలు గుడ్ న్యూస్. సముద్రంలో చేపల వేటపై ఏటా విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది సాయాన్ని మరో పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సముద్ర మత్స్య సంపదను సంక్షించడం, చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటానికి ఈ 61 రోజుల నిషేధం విధిస్తారు. సాధారణంగా ఏప్రిల్‌ 15 నుంచి జూన్ 14 వరకు చేపలు, రొయ్యల, సంతాన ఉత్పత్తి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో యాంత్రిక, మోటరైజ్డ్‌ బోట్లతో వేట సాగిస్తే మత్స్యసంపద లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తూర్పు తీరంలో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే ఈ రెండు నెలల పాటు సముద్రంలోకి వెళ్లలేని మత్స్యకారులకు ఉపాధి కరవై, వారి కుటుంబాలు గడవడం భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కష్టకాలంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 

15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు

గత ఏడాది 2025లో ఏప్రిల్ 26న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మే 1 నుంచి మే ఆరు వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన అనంతర తుది జాబితాను కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల అంచనా ప్రకారం మే 15 లేదా 16 తేదీల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20 వేల రూపాయల జమ అయ్యే అవకాశం ఉంది. 

ఇవి పక్కాగా ఉంటేనే డబ్బులు

ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిబంధలను పెట్టింది. మత్స్యకారుల వయసు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసే వారు లేదా బోటు యజమానులు మాత్రమే అర్హులు. వేట నిషేద సమయంలో సముద్రంలోకి వెళ్లని వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 

రూల్స్ సవరించిన కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనం కోసం కొన్ని పాత రూల్స్‌ను సవరించింది. గతంలో మోటారు పడవలకు కనీసం వెయ్యి లీటర్ల, మెకనైజ్డ్‌ పడవలకు వెయ్యి లీటర్ల డీజిల్ రాయితీని వినియోగించి ఉండాలనే నిబంధన ఉండేది. ప్రభుత్వం ఆ రూల్‌ను తొలగించింది. మత్స్యశాఖలో నమోదైన అన్ని అర్హత గల బోట్లకు భృతిని వర్తింపజేస్తోంది. ఎన్టీఆర్ పెన్షన్ పొందుతున్న వారు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ ఇరవై వేల సాయం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. 

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మత్స్యకారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి gswsnbm.ap.gov.in పోర్టల్‌ను సందర్శించవచ్చు. మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ నమోదు చేసి, మొబైల్‌ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా మీ పేమెంట్‌ స్టేటస్‌ చూడవచ్చు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.  

Frequently Asked Questions

మత్స్యకార భరోసా పథకం ఎందుకు అమలు చేస్తున్నారు?

సముద్రంలో చేపల వేటపై విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయంలో మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు.

2026 సంవత్సరానికి మత్స్యకార భరోసా పథకం కింద ఎంత మొత్తం అందజేయనున్నారు?

తాజా సమాచారం ప్రకారం, మే 15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.

మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధి పొందడానికి అర్హతలు ఏమిటి?

మత్స్యకారుల వయసు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి, మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసేవారు లేదా యజమానులు, వేట నిషేధ సమయంలో సముద్రంలోకి వెళ్లనివారు అర్హులు.

దరఖాస్తు స్థితిని ఎలా తెలుసుకోవచ్చు?

lmbm.ap.gov.in పోర్టల్‌లో మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget