అన్వేషించండి

AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మత్స్యకార భరోసా పథకం కింద 20 వేల రూపాయలు అందజేస్తుంది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మత్స్యకార భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • మే 15 లేదా 16న లబ్ధిదారుల ఖాతాల్లో ₹20,000 జమ అవుతుంది.
  • కొత్త నిబంధనలు, రూల్స్ సవరించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది.
  • gswsnbm.ap.gov.in పోర్టల్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

AP Matsyakara Bharosa 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాలు గుడ్ న్యూస్. సముద్రంలో చేపల వేటపై ఏటా విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది సాయాన్ని మరో పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సముద్ర మత్స్య సంపదను సంక్షించడం, చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటానికి ఈ 61 రోజుల నిషేధం విధిస్తారు. సాధారణంగా ఏప్రిల్‌ 15 నుంచి జూన్ 14 వరకు చేపలు, రొయ్యల, సంతాన ఉత్పత్తి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో యాంత్రిక, మోటరైజ్డ్‌ బోట్లతో వేట సాగిస్తే మత్స్యసంపద లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తూర్పు తీరంలో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే ఈ రెండు నెలల పాటు సముద్రంలోకి వెళ్లలేని మత్స్యకారులకు ఉపాధి కరవై, వారి కుటుంబాలు గడవడం భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఈ కష్టకాలంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 

15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు

గత ఏడాది 2025లో ఏప్రిల్ 26న నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మే 1 నుంచి మే ఆరు వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన అనంతర తుది జాబితాను కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల అంచనా ప్రకారం మే 15 లేదా 16 తేదీల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 20 వేల రూపాయల జమ అయ్యే అవకాశం ఉంది. 

ఇవి పక్కాగా ఉంటేనే డబ్బులు

ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిబంధలను పెట్టింది. మత్స్యకారుల వయసు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసే వారు లేదా బోటు యజమానులు మాత్రమే అర్హులు. వేట నిషేద సమయంలో సముద్రంలోకి వెళ్లని వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 

రూల్స్ సవరించిన కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనం కోసం కొన్ని పాత రూల్స్‌ను సవరించింది. గతంలో మోటారు పడవలకు కనీసం వెయ్యి లీటర్ల, మెకనైజ్డ్‌ పడవలకు వెయ్యి లీటర్ల డీజిల్ రాయితీని వినియోగించి ఉండాలనే నిబంధన ఉండేది. ప్రభుత్వం ఆ రూల్‌ను తొలగించింది. మత్స్యశాఖలో నమోదైన అన్ని అర్హత గల బోట్లకు భృతిని వర్తింపజేస్తోంది. ఎన్టీఆర్ పెన్షన్ పొందుతున్న వారు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ ఇరవై వేల సాయం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. 

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మత్స్యకారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి gswsnbm.ap.gov.in పోర్టల్‌ను సందర్శించవచ్చు. మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ నమోదు చేసి, మొబైల్‌ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా మీ పేమెంట్‌ స్టేటస్‌ చూడవచ్చు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.  

Frequently Asked Questions

మత్స్యకార భరోసా పథకం ఎందుకు అమలు చేస్తున్నారు?

సముద్రంలో చేపల వేటపై విధించే 61 రోజుల వార్షిక నిషేధ సమయంలో మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు.

2026 సంవత్సరానికి మత్స్యకార భరోసా పథకం కింద ఎంత మొత్తం అందజేయనున్నారు?

తాజా సమాచారం ప్రకారం, మే 15 లేదా 16 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.

మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధి పొందడానికి అర్హతలు ఏమిటి?

మత్స్యకారుల వయసు 18-60 ఏళ్ల మధ్య ఉండాలి, మత్స్యశాఖలో నమోదైన బోట్లలో పని చేసేవారు లేదా యజమానులు, వేట నిషేధ సమయంలో సముద్రంలోకి వెళ్లనివారు అర్హులు.

దరఖాస్తు స్థితిని ఎలా తెలుసుకోవచ్చు?

lmbm.ap.gov.in పోర్టల్‌లో మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:మాచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వాహనం- నలుగురు స్పాట్ డెడ్ 
మాచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వాహనం- నలుగురు స్పాట్ డెడ్ 
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
NBK112 Launch: నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
Advertisement

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget