అన్వేషించండి

Andhra Pradesh Weather: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు బిగ్ అలర్ట్- చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Andhra Pradesh Latest Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు యాభైకిపైగా మండలాల్లో వడగాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Andhra Pradesh Latest Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో సూరీడు సుర్రుమంటున్నాటు. తగ్గేదేలే అన్నట్టు రోజురోజుకు తీవ్ర పెంచేస్తున్నాడు. మార్చి నెలలోనే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు, విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది. 

మారిన వాతావరణంతో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో మాత్రం ఉష్ణోగ్రతులు పెరుగుతాయని చెబుతోంది. ఉష్ణోగ్రతకు తోడు వివిధ ప్రాంతాల్లో వీచే వడగాలులు మరింత సెగలు పుట్టిస్తాయని విపత్తు నిర్వహాణ అధికారులు చెప్పారు.  

గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 59 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది విపత్తు నిర్వహణ శాఖ. శుక్రవారం 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల పాటు వాతావరణంలో పెద్దగా మార్పులు లేకపోయినా సెగలు మాత్రం తప్పవని చెబుతున్నారు.  

నేడు వడగాలులు వీచే మండలాలు జిల్లాల వారిగా చూస్తే... శ్రీకాకుళం జిల్లా-15, విజయనగరం-20, పార్వతీపురం మన్యం-14, అల్లూరి సీతారామరాజు-2, కాకినాడ-3, తూర్పుగోదావరి-5 ఉన్నాయి. బుధవారం నమోదు అయిన ఉష్ణోగ్రత వివరాలు గమనిస్తే... అత్యధిక ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా  అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  

అందుకే అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రావాల్సి వస్తే అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. ఇంట్లో ఉన్న ముసలివాళ్లు, చిన్న పిల్లలు, హృద్రోగులు, గర్భిణిలు మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. నీళ్లు ఎక్కువ తాగాలని హెచ్చరిస్తున్నారు. లేకుంటే డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Andhra Pradesh Latest News: సుచిత్ర ఎల్లా, సోమనాథ్‌, సతీష్‌ రెడ్డి, కేపీసీ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
సుచిత్ర ఎల్లా, సోమనాథ్‌, సతీష్‌ రెడ్డి, కేపీసీ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
Telangana Latest News:హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
Viral News: పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి  ప్రచారం
పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి ప్రచారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Andhra Pradesh Latest News: సుచిత్ర ఎల్లా, సోమనాథ్‌, సతీష్‌ రెడ్డి, కేపీసీ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
సుచిత్ర ఎల్లా, సోమనాథ్‌, సతీష్‌ రెడ్డి, కేపీసీ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
Telangana Latest News:హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
Viral News: పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి  ప్రచారం
పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి ప్రచారం
Supreme Court On Ration Card: 'రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది' సుప్రీంకోర్టు ఆందోళన
'రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది' సుప్రీంకోర్టు ఆందోళన
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Embed widget