అన్వేషించండి

Andra pradesh: ఏపీలో 28వేల కోట్ల మద్యం అమ్మకాలకు లెక్కల్లేవు, మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపణలు

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 28 వేల కోట్ల మద్యం అమ్మకాలకు లెక్కలు లేవని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యంతో దోపిడీ చేస్తూ జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్తారు అంటూ ప్రశ్నించారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్సైట్ ఎందుకు మూసివేశారు? రాష్ట్రంలో వేయి కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా  ఈడీ, సీబీఐలకు ఇది కనిపించడం లేదా? అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.

" జగన్ ప్రతి ఇంటికి వెళ్లి నేనే మీ ఆరోగ్యాన్ని కాపాడతానని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఏమీ అభ్యంతరంలేదు.  వైద్యం అందక ఆశ వర్కర్ ఒక అమ్మాయి చనిపోయింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు జగనే సురక్ష అని ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం. వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీకి దిక్కులేదు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో, కిమ్స్ రెండు ఆసుప్రతుల్లోను ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడంలేదు. జగనన్న వచ్చాక వద్దు,  మేం తీసుకోము అంటున్నారు. విత్ డ్రా చేసుకున్నారు. జగన్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. అనేక ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషంట్లను వెనక్కి పంపిస్తున్నారు. నేడు ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టి దాదాపు చీప్ లిక్కర్ 41 వేల కోట్ల దోపిడి చేశారు. సేల్స్ చూపించకుండా తగ్గించి చూపించి ప్రతి సంవత్సరం 7 వేల కోట్లు  దోపిడీ జరుగుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో కరెన్సీ నోట్లు ఇస్తే తప్ప మద్యం ఇవ్వరు. మద్యం షాపుల్లో రసీదు ఇవ్వరు" అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 

అక్రమ ఆర్జన కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా?

అక్రమ సంపాదన కోసం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తావా అని ప్రశ్నించారు.  మద్యం నిషేదం  అంటూ  ప్రజలకు సొల్లు కబుర్లు చెప్పి నేడు నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే నేషనల్, ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లు రద్దు చేసి, తన బినామీలు, వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యం విక్రయించి వేల కోట్లు దండుకుంటున్నారని సోమిరెడ్డి చెప్పారు.  నాలుగున్నరేళ్లలో మద్యంపైనే రూ. 92 వేల కోట్లు సంపాదించారు. ఇది మందుబాబుల రక్తమాంసంతో తడిసిన డబ్బులే అని మాజీ మంత్రి సోమిరెడ్డి  చెప్పారు. 

ఈ నాసిరకం మద్యం త్రాగిన వారి నాడీ వ్యవస్ధ దెబ్బతిని తల తిరగడం, శరీరం మొత్తం మెలికలు తిరగడం, వాంతులు, మానసిక గందరగోళానికి గురయ్యే విషరసాయనాలు ఉన్నట్టు చెన్నైలోని SGS ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అమ్మే కల్తీ మద్యం మరియు నాటు సారా త్రాగి ప.గో జిల్లా జంగారెడ్డి గూడెంలో వారం (03 మార్చి 2022 నుంచి 09 మార్చి 2022) రోజుల వ్యవధిలోనే 26 మంది  చనిపోయారని తెలిపారు.  విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు ఇలా ప్రతి జిల్లాలో రోజు పదుల సంఖ్యలో మద్యం త్రాగి అనారోగ్యం పాలైన ఆస్పత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా  దీని వల్ల నాలుగున్నరేల్లలో వందలాంది మంది ప్రాణాలు కోల్పాయారని సోమిరెడ్డి చెప్పారు. 

ఒక్క విశాఖ కేజీహెచ్ లో ఏడాదిలో 36 మంది చనిపోయారని వెల్లడించారు. ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే అని అన్నారు.  ఏడాది వ్యవధిలో వారిలో 36మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా.. వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నార చెప్పారు.  కేజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగం వార్డులో 37 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 25 మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆరోపించారు. మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నారని చెప్పారు. కాలేయం, క్లోమగ్రంధి (పాంక్రియాస్) దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరుగుతోందని దేనిపై ప్రజలు ఆలోచించాలని చెప్పారు. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే....కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుందని.... కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో  లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెప్పడం తమ దృస్టికి వచ్చిందని అన్నారు.  

బాధితులు ఎక్కువ రోజువారీ కూలీలే
బాధితుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పేదలే. వీరు రోజు కూలీలుగా పనిచేస్తూ తమకొచ్చే ఆదాయంలో  సగానికి పైగా మద్యంపైనే వెచ్చిస్తున్నారు.  దీంతో వారి ఒళ్లు గుల్లవుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, మంచానికి పరిమితమైపోయి అంతకుముందులా ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. 


టీడీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు లేకుండా చూసింది
టీడీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు లేకుండా చూసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం హయాంలో అనేకమందిపై ఎక్సైజ్ డిపార్టుమెంట్ కేసులు పెట్టి బెల్ట్ షాపులను నిరోధించిందని చెప్పారు. ఇప్పటి పరిస్థితులకు, అప్పటి పరిస్థితులకు ప్రజలు బేరీజు వేసుకోవాలని సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 150 రూపాయల ఉన్న మద్యం బాటిల్ ను  250 రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యం సారాయి దొరకని, బెల్ట్ షాపులు లేని పది గ్రామాలు చూపించగలరా అని నేను ఛాలెంజ్ చేస్తున్నానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
Chitram Choodara Movie Review - చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
చిత్రం చూడరా మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
Embed widget