అన్వేషించండి

AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !

ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లాఠీ దెబ్బలకు వెరవకుండా విద్యార్ధులు రోడ్లపైకి రావడంతో ప్రభుత్వం వెక్కి తగ్గక తప్పలేదు.

ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పటికి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న విద్యా సంస్థలు కూడా మళ్లీ తమ విద్యాసంస్థల్ని నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజులుగా ఎయిడెడ్ విద్యా సంస్థల విద్యార్థులు రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలకు ఫలితం లభించినట్లయింది. విద్యార్థులు పిడికిలి బిగిస్తే ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గక తప్పదని నిరూపితమయింది.
AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !

Also Read : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?

ఎయిడెడ్ జీవోపై కదిలిన లక్షల మంది విద్యార్థులు !

ఏపిలో ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఎయిడెడ్ జూనియర్ కాలేజిలు 122 , ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు 137 ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆస్తులతో సహా ఏపి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అలా చేయకుంటే వారి ముందున్న మరో ఆప్షన్  సొంత నిధులతోనే విద్యాంస్దలను నడుపుకోవడం. అంటే ఇన్నాళ్లు ఆయా విద్యాసంస్దల్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులంతా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోతారు. ఎయిడ్ విద్యాసంస్దల యాజమాన్యాలే తిరిగి ఉపాద్యాయులను సొంత నిధులతో నియమించుకుని .. జీతాలు చెల్లించడం చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి స్వాధీనం చేయని ఎయిడెడ్ విద్యాసంస్దలలకు ప్రభుత్వం ఎయిడ్ ఆపేస్తుంది. అంటే అది ప్రైవేటు విద్యా సంస్థ అయిపోతుందన్నమాట. ఈ కారణంగా చాలా విద్యా సంస్థలు ఫీజులు పెంచడం లేదా స్కూళ్లను మూసివేయడం చేస్తున్నాయి.
AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !

Also Read : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు

లాఠీ దెబ్బలకు వెరవకుండా రోడ్డెక్కి పోరాటం !

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో అందరికీ అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు చేస్తే ఏ వివాదమూ ఉండేది కాదు. కానీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా విద్యా సంస్థలు ఫీజుల భారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని విద్యా సంస్థలు మొత్తానికే మూసివేత నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విద్యా సంస్థలతో పెద్దగా సమస్య రాలేదు. కానీ ఎక్కువ ఎయిడెడ్ విద్యా సంస్థలు బలవంతం మీద ప్రభుత్వానికి అప్పగించాయన్న విమర్శలు వచ్చాయి.కారణాలు ఏమైతేనేం తమకు అన్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ధర్నాలతో హోరెత్తించారు. లాఠీ దెబ్బలకు వెనుకాడలేదు. పోలీసుల బెదిరింపులకూ తగ్గలేదు. కడ వరకూ పోరాడారు.
AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !

Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

తమ పోరాటంతో స్కూళ్లను కాపాడుకున్న విద్యార్థులు !

మొదట విశాఖలో ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. అది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. చివరికి అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఉద్యమం మరింత పెరగడానికి కారణం అయింది. అన్ని జిల్లాల్లోనూ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఇలాంటి వాతావరణమే ఉంది. ప్రభుత్వం తమను చదువుకు దూరం చేస్తోందన్న అభిప్రాయంతో  ఎక్కువ మంది ఉన్నారు. వారంతా రోడ్డుపైకి ఎక్కడంతో చివరికి ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. జీవోను రద్దు చేయలేదు. మరో రెండు ఆప్షన్లు మాత్రమే ఇచ్చింది. అందుకే విద్యార్థుల ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉందని భావిస్తున్నారు. 

Also Read : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Virat Kohli : విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
Embed widget